టానిక్ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారి

టానిక్ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారి

Last Updated : Sep 28, 2019, 02:55 PM IST
టానిక్ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారి

భద్రాద్రి కొత్తగూడెం: టానిక్‌ అనుకుని తెలియక పురుగుల మందు తాగిన ఓ ఆరేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. లక్ష్మీదేవిపల్లి సమీపంలోని తిప్పగుట్ట గ్రామానికి చెందిన బోడా శంకర్‌, సాల్కి దంపతుల కూమార్తె అశ్విని శుక్రవారం తోటి పిల్లలతో కలిసి ఇంటి బయట ఆడుకుంటోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ అబ్బాయి చేతిలో ఉన్న సీసాను చూసి టానిక్ అని పొరపడిన అశ్విని.. ఆ ద్రావణాన్ని తాగి వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకుంది.

చిన్నారి అశ్విని అపస్మారక స్థితిలోకి జారుకోవడం గమనించిన కుటుంబసభ్యులు.. హుటాహుటిన ఆమెని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో ఆ చిన్నారి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృతిచెందడం పలువురిని తీవ్ర కంటతడి పెట్టించింది.

Trending News