GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికలకు జనసేన దూరం.. బీజేపీకి మద్దతు...

Janasena In GHMC Elections  | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత తమ పార్టీ జనసేత పోటీలో ఉంటుంది అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు.

Last Updated : Nov 20, 2020, 05:22 PM IST
    1. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత తమ పార్టీ జనసేత పోటీలో ఉంటుంది అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు.
    2. అయితే ఇటీవలే నామినేషన్ ప్రక్రియ మొదలు అవడం, తరువాత నేడు చివరి రోజు కావడంతో ఈ మధ్యలోనే పవన్ కల్యాణ్ తన మనసు మార్చుకున్నట్టున్నారు.
    3. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు.
GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికలకు జనసేన దూరం.. బీజేపీకి మద్దతు...

Pawan Kalyan: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత తమ పార్టీ జనసేత పోటీలో ఉంటుంది అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. అయితే ఇటీవలే నామినేషన్ ప్రక్రియ మొదలు అవడం, తరువాత నేడు చివరి రోజు కావడంతో ఈ మధ్యలోనే పవన్ కల్యాణ్ తన మనసు మార్చుకున్నట్టున్నారు. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు.

Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత? 

భారతీయ జనతా పార్టీ ( BJP) అగ్రనేతలు అయిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తో ఇవాళ మధ్యహ్నం సమావేశం అయ్యారు పవన్ కల్యాణ్. ఈ సమావేశం జనసేన నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలి అని నిర్ణయించుకున్న జనసేన పార్టీ.. ప్రస్తుతం భాజపాతో పోత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తోందని సమాచారం. 

Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?

అయితే దీనికి తెలంగాణ భాజపా చీఫ్ బండి సంజయ్ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఎవరితో పొత్తు ఉండబోదు అని స్పష్టం చేశారు. అయితే జనసేన ( Janasena) పార్టీ మాత్రం ఆ విషయంలో బండి సంజయ్ తో మాట్లాడుతాం అని తెలపడంతో గందరగోళం ఏర్పడింది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News