Attack on KA Paul: కేఏ పాల్ పై యువకుడి దాడి.. ఎందుకంటే ?

Attack on KA Paul:ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై సిద్ధిపేట జిల్లాలో దాడి జరిగింది.  ఓ యువకుడి పాల్ ను చంపదెబ్బ కొట్టాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 07:25 PM IST
  • సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్‌పై దాడి
  • పాల్‌పై దాడి చేసి కొట్టిన టీఆర్‌ఎస్ నాయకుడు
  • రైతుల దగ్గరకు వెళ్లకుండా పాల్‌ను అడ్డుకున్న పోలీసులు
Attack on KA Paul: కేఏ పాల్ పై యువకుడి దాడి.. ఎందుకంటే ?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై సిద్ధిపేట జిల్లాలో దాడి జరిగింది.  రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ వెళుతుండగా.. సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును ఖండించిన పాల్.. వారితో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్ ను చంపదెబ్బ కొట్టాడు. ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి చేసిన యువకుడితో కేఏ పాల్ అనుచరులు గొడవపడ్డారు. దాడి చేసిన యువకుడు టీఆర్‌ఎస్ నాయకుడిగా తెలుస్తోంది. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ కేఏ పాల్ డిమాండ్ చేశారు.

Also Read: Ka Paul On Kcr: నన్ను అడ్డుకుంటే వైఎస్సార్ కు పట్టిన గతే! కేసీఆర్ కు కేఏ పాల్ వార్నింగ్..

Also Read: KTR VERSES KISHAN REDDY : కేటీఆర్ వర్సెస్ కిషన్‌ రెడ్డి.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ట్వీట్ల యుద్ధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News