జరక్క జరక్క లేటు వయసులో ఆ బ్రహ్మచారికి పెళ్లి... ఇంతలోనే ఊహించని షాకిచ్చిన నవ వధువు...

Groom duped by bride: పెళ్లయిన మరుసటిరోజు ఆ జంట హైదరాబాద్‌లో షాపింగ్ చేసి.. అక్కడినుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న కాసేపటికి తలనొప్పిగా ఉందని చెప్పి ఆ నవ వధువు తన భర్తను మెడికల్ షాప్‌కు పంపించింది. అతను ఇంటికి తిరిగొచ్చాక కానీ అసలు విషయం అర్థం కాలేదు..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2021, 12:44 PM IST
  • పెళ్లి పేరుతో మోసపోయిన ఓ 40 ఏళ్ల బ్రహ్మచారి
  • పెళ్లయిన రెండు రోజులకే నవ వధువు పరార్
  • నగదు, బంగారం, దుస్తులతో పరారైన వధువు
జరక్క జరక్క లేటు వయసులో ఆ బ్రహ్మచారికి పెళ్లి... ఇంతలోనే ఊహించని షాకిచ్చిన నవ వధువు...

Groom duped by bride: అతనో పెళ్లి కాని ప్రసాద్... వయసు పైబడిపోతున్నా పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోలేదు... తీరా 40 ఏళ్లు వచ్చాక మనసు పెళ్లి మీదకు మళ్లింది... కానీ ఆ వయసులో పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు... ఓవైపు పెళ్లి చేసుకోవాలనే కోరిక... మరోవైపు సంబంధాలు రాని వైనం... ఇంకా ఆలస్యం చేస్తే ఇక తనకు పెళ్లి యోగ్యం ఉండదనుకున్నాడు... ఎలాగైనా సరే ఎవరో ఒక అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసి మమా అనిపించాలనుకున్నాడు... అనుకున్నట్లే పెళ్లయితే చేసుకున్నాడు.. కానీ ఆ తర్వాత పెళ్లి కూతురు (Newlywed) ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు.

రంగారెడ్డి (Rangareddy) జిల్లా యాచారానికి చెందిన ఓ వ్యక్తి (40) ఏవేవో కారణాలతో చాలా ఏళ్లు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు. తీరా 40 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధపడగా పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇక చేసేదేమీ లేక తెలిసిన మిత్రుడి సాయంతో ఓ పెళ్లిళ్ల బ్రోకర్‌ను కలిశాడు. తనకు తెలిసిన ఓ అమ్మాయి ఉందని... వెనుకా, ముందు ఎవరూ లేరని...  రూ.1లక్ష ఇస్తే సంబంధం కుదురుస్తానని చెప్పాడు. ఎలాగైనా సరే త్వరగా పెళ్లయిపోవాలన్న కుతూహలంతో సదరు బ్రహ్మచారి ఆ వ్యక్తి అడిగినంత డబ్బు ముట్టజెప్పాడు.

చెప్పినట్లే ఆ బ్రోకర్ ఆ బ్రహ్మచారిని విజయవాడ (Vijayawada) తీసుకెళ్లి తను చెప్పిన అమ్మాయిని చూపించాడు. గత గురువారం (డిసెంబర్ 16) ఇద్దరు విజయవాడలోనే ఓ లాడ్జిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత యాదాద్రికి వచ్చి వ్రతం కూడా చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి షాపింగ్ చేయగా... భార్యకు అతను 3 తులాల బంగారం, రూ.40వేల దుస్తులు కొనిచ్చాడు. ఆ సమయంలో అతని భార్య వెంబడి ఆమె స్నేహితురాలు కూడా వెంట వెళ్లింది. అక్కడి నుంచి ముగ్గురు కలిసి రాత్రి 8.30గం. సమయంలో యాచారంలోని వరుడి ఇంటికెళ్లారు.

ఇంటికి చేరుకున్న కాసేపటికి తలనొప్పిగా ఉందని చెప్పి ఆ నవ వధువు (Newlywed bride) తన భర్తను మెడికల్ షాప్‌కు వెళ్లి మందులు తీసుకురమ్మని పంపించింది. అప్పటికే ఆ మహిళ, తన స్నేహితురాలు కలిసి ఓ అద్దె కారు మాట్లాడుకున్నారు. భర్త ఇంటికి వచ్చే లోపు... ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.2 లక్షలు, కొత్త దుస్తులన్నీ బ్యాగులో సర్దేసుకుని జంప్ అయిపోయారు. కారు కొంత దూరం వెళ్లాక ఇద్దరు మహిళలు కారులోనే దుస్తులు మార్చుకోవడంతో డ్రైవర్ అవాక్కయ్యాడు. ఇదేంటని ప్రశ్నించగా... ఆ ఇద్దరు డ్రైవర్‌నే బెదిరించే ప్రయత్నం చేశారు. డ్రైవర్ వారిని ఎల్బీనగర్ వద్ద దింపడంతో అక్కడినుంచి విజయవాడ వైపు వెళ్లిపోయారు. మెడికల్ షాపు నుంచి ఇంటికొచ్చిన ఆ నవ వరుడికి (Groom) కొంత సేపటికి కానీ అసలు విషయం అర్థం కాలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

Also Read: మైనర్‌పై అత్యాచారం.. పాకిస్తాన్ స్టార్ ఆటగాడిపై ఎఫ్ఐఆర్ నమోదు! ఇక కెరీర్ కంచికే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x