జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లని ఓదార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్

జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లని ఓదార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్

Last Updated : Aug 29, 2018, 07:10 PM IST
జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లని ఓదార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్

ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేటి మధ్యాహ్నం హరికృష్ణ నివాసంలో ఆయన పార్థివదేహానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నందమూరి హరికృష్ణ వారసులు, ప్రముఖ సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లను కేసీఆర్ ఓదార్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న హరికృష్ణ సమీప బంధువైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హరికృష్ణ సోదరుడు నందమూరి బాలకృష్ణలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదం కారణంగా హఠాన్మరణం చెందడం దురదృష్టకరమైన ఘటన అని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి సైతం అదే సమయంలో నందమూరి హరికృష్ణ పార్థివదేహనికి నివాళి అర్పించారు.

 

Trending News