Cm Jagan: రాజమండ్రిలో సీఎం జగన్‌ పర్యటన


Cm Jagan: రాజమండ్రిలో  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి.. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా  పెన్షన్‌  మొత్తాన్ని పెంచడంతో  లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.

  • Zee Media Bureau
  • Jan 3, 2023, 05:48 PM IST


Cm Jagan: రాజమండ్రిలో  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి.. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా  పెన్షన్‌  మొత్తాన్ని పెంచడంతో  లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయన అక్కడి లబ్ధిదారుల మనోభావాలను తెలుసుకోనున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ లబ్ధి చేకూరే విధంగా పెన్షన్ వారోత్సవాలు ప్రకటించనున్నారాయన. మరోవైపు గత రెండు రోజులుగా పెన్షన్‌ పెంపు వారోత్సవాల కోలాహలం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా ఇందులో పాల్గొంటున్నారు. ఇక సీఎం వైఎస్‌ జగన్‌ రాక సందర్భంగా రాజమండ్రిలో భారీ ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. మున్సిపల్ గ్రౌండ్‌ వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో  పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News