మద్యం మత్తులో బతికున్న కోడి తినేశాడు..!

                          

Last Updated : Aug 1, 2018, 07:30 PM IST
మద్యం మత్తులో బతికున్న కోడి తినేశాడు..!

మద్యం మత్తులో ఓ యువకుడు అనాగరిక చర్యకు పాల్పడ్డారు..ఏకంగా బతికున్న కోడినే పీక్కుతిన్నాడు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం ఆర్వోబీ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లినట్లయితే కేసముద్రం ప్రాంతానికి  చెందిన ఇద్దరు యువకులు కోళ్ల దుకాణంలో కోడిని కొనుగోలు చేశారు..మద్యం అతిగా సేవించడంతో ఆర్వోబీకి వెళ్లే రోడ్డు పక్క ఓ యువకుడు కిందపడిపోయాడు. ఆకలిగా ఉన్న మరో యువకుడికి చేతిలో ఉన్న కోడిని అలాగే పీక్కుతిన్నాడు.  ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్‌గా మారింది.

Trending News