ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమితులైన పృథ్వీరాజ్‌

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమితులైన పృథ్వీరాజ్‌

Last Updated : Jul 19, 2019, 09:50 PM IST
ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమితులైన పృథ్వీరాజ్‌

తిరుమల: ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్‌ బాలిరెడ్డిని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌గా నియమిస్తూ ఎస్వీబీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం తిరుపతిలో జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు నుంచే పార్టీ తరపున బలంగా ప్రచారం చేసిన సినీ ప్రముఖుల్లో ఒకరైన పృథ్వీరాజ్‌ని ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమించాలని పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్టు గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అందుకు అనుగుణంగా ఎస్వీబీసి బోర్డు సైతం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు నియమితులయ్యారు. అయితే, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోల్పోయి ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో ఫృథ్వీరాజ్‌ను నియమిస్తూ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Trending News