సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఓవైసీ సవాల్

ఇదే బహిరంగ సభా వేదికపై నుంచి ఓవైసీ హిందువులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.   

Last Updated : Mar 3, 2018, 05:34 PM IST
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఓవైసీ సవాల్

రానున్న లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీజేపీ స్థానాన్ని తమ పార్టీ కచ్చితంగా గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోదీకి దమ్ముంటే వెంటనే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని రద్దు చేసి అక్కడ తిరిగి ఎన్నికలు నిర్వహించాలని మోదీకి ఛాలెంజ్ చేశారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు భిన్నంగా పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై సర్వత్రా వ్యతిరేకత పెరుగుతోంది. తెలంగాణలోనూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర వ్యతిరేకత వుంది అని అన్నారు ఓవైసీ. నాంపల్లిలోని దారుసలాం మైదానంలో శుక్రవారం జరిగిన మజ్లిస్‌ పార్టీ 60వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా పార్టీ శ్రేణులని ఉద్దేశించి మాట్లాడుతూ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

" ఇక తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలకు భవిష్యత్‌ లేదు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం కావాలి " అని పార్టీ కార్యకర్తలకు పిలుపుని చ్చారు. మోదీ తన నాలుగేళ్ల పాలనలో ప్రజల ఆశలను వమ్ముచేశారు. కేవలం ప్రజలను మభ్యపె డుతు పాలన కొనసాగిస్తున్నారే తప్పితే నిజానికి దేశాన్ని అభివృద్ధి చేయలేదు అని ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఇదే బహిరంగ సభా వేదికపై నుంచి ఓవైసీ హిందువులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. 

Trending News