Janasena Assembly Candidates: ఏపీ అసెంబ్లీ బరిలో నిలిచే జనసేన అభ్యర్ధుల జాబితా ఇదే

Janasena Assembly Candidates: ఏపీలో ఎన్నికల  వాతావరణం వేడెక్కుతోంది. పార్టీ అభ్యర్దుల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. పొత్తులో భాగమైన బీజేపీ-జనసేన-తెలుగుదేశం పార్టీలు అభ్యర్ధుల్ని దాదాపుగా ప్రకటించాయి. తాజాగా జనసేన జాబితా విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 25, 2024, 05:55 AM IST
Janasena Assembly Candidates: ఏపీ అసెంబ్లీ బరిలో నిలిచే జనసేన అభ్యర్ధుల జాబితా ఇదే

Janasena Assembly Candidates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి పోటీ రసవత్తరంగా ఉండనుంది. అధికార పార్టీ ఒక్కటే ఒంటరిలో బరిలో నిలుస్తోంది. అటు తెలుగుదేశం-బీజేపీ-జనసేనలు కూటమిగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జతచేరి ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంంది. ఈ క్రమంలో దాదాపు అన్ని పార్టీల అభ్యర్ధుల ప్రకటన కొలిక్కి వచ్చినట్టే కన్పిస్తోంది. బీజేపీ ఎంపీ అభ్యర్ధులు మినహా అంతా సిద్ధంగా ఉంది. 

ఏపీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ 17 లోక్‌సభ స్థానాల్లో పోటీకి చేయనుండగా జననసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాలు తప్ప దాదాపుగా అన్ని అన్ని స్థానాల్లో అభ్యర్ధుల్ని ప్రకటించింది. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. ఇంకా అసెంబ్లీ స్థానాల్లో ఎవరు ఎక్కడనేది తెలియాల్సి ఉంది. ఇక జనసేన పోటీ చేసే 2 లోక్‌సభ స్థానాల్లో కాకినాడ నుంచి టీ టైమ్ అధినేత ఉదయ్్ శ్రీనివాస్ బరిలో ఉంటే..మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేయనున్నారు. 

ఇప్పుడు తాజాగా కొన్నిస్థానాలకు అభ్యర్ధుల్ని ప్రకటించడం ద్వారా మొత్తం 18 స్థానాల్లో జనసేన అభ్యర్ధులు ఎవరనేది స్పష్టత వచ్చింది. ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు అభ్యర్ధుల్ని పెండింగులో ఉంచింది. 

జనసేన అసెంబ్లీ అభ్యర్దులు

నెల్లిమర్ల నుంచి లోకం మాధవి
అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ
పెందుర్తి నుంచి పంచకర్ల రమేశ్ బాబు
ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్
పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్
కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ
రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ
పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ
రాజోలు నుంచి దేవ వరప్రసాద్
నిడదవోలు నుంచి కందుల దుర్గేష్
తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్
భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు
ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు
పోలవరం నుంచి చిర్రి బలరాజు
నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్
తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్
తిరుపతి నుంచి అరణి శ్రీనివాసులు
రైల్వేకోడూరు నుంచి డాక్టర్ యనమల భాస్కరరావు

మరోవైపు బీజేపీ అదిష్టానం కూడా ఏపీలో ఆ పార్టీ పోటీ చేసే ఆరు లోక్‌సభ స్థానాల అభ్యర్ధుల్ని అదికారికంగా ప్రకటించింది. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. 

Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News