ఏపీలో మరో 82 కరోనా కేసులు.. ఓ జిల్లాలో 300కు పైగా బాధితులు!

ఓవైపు తెలంగాణలో వేళ్ల మీద లెక్కపెట్టేలా కరోనా కేసులు నమోదవుతుంటే, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైరస్ సమస్యతో సతమతమవుతోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 28, 2020, 02:49 PM IST
ఏపీలో మరో 82 కరోనా కేసులు.. ఓ జిల్లాలో 300కు పైగా బాధితులు!

ఓవైపు తెలంగాణలో వేళ్ల మీద లెక్కపెట్టేలా కరోనా కేసులు నమోదవుతుంటే, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైరస్ సమస్యతో సతమతమవుతోంది. పైగా కరోనాతో జీవించాలని సైతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఏపీలో గడిచిన 24 గంటల్లో 82 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259కు చేరుకుంది.   సమంత బర్త్‌డే.. నాగచైతన్య సర్‌ప్రైజ్

మొత్తం 1259 కరోనా పాజిటివ్ కేసులకుగానూగానూ చికిత్స అనంతరం 258 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. కాగా, కరోనా బారిన పడి ఏపీలో ఇప్పటివరకు 31 మంది మరణించారు. ప్రస్తుతం 970 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఏపీ వైద్యశాఖ మంగళవారం ఉదయం ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. #APFightsCorona  Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!

Image Credit: twitter/@ArogyaAndhra

గడిచిన 24 గంటల్లో 5783 మంది నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయగా 82 మంది కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులో అధికంగా కర్నూలులో నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే కర్నూలులో 40, గుంటూరులో 17,  కృష్ణాలో 13, కడపలో 7, నెల్లూరులో 3, అనంతపురం జిల్లాలో 1, చిత్తూరులో ఒక్కటి చొప్పున తాజాగా కరోనా పాజిటివ్ కసులు నమోదయ్యాయి.  ఉమర్ అక్మల్‌పై నిషేధం.. ఇడియట్ అంటూ మాజీ క్రికెటర్ ఫైర్

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News