మరో పరువుదాడి... ప్రాణాపాయ స్థితిలో ప్రియుడు !

తెలుగు రాష్ట్రాలు పరువు దాడుల నిలయంగా మారాయి. మొన్న విజయవాడలో ప్రయణ్ ఉదంతం.. నిన్న భాగ్యనగరంలో మరో దాడి..ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఈ రోజు కరీంనగర్ లో పరుగు దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రియుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.. 

Last Updated : Oct 3, 2018, 12:08 PM IST
మరో పరువుదాడి... ప్రాణాపాయ స్థితిలో ప్రియుడు !

ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన సాయి అనే యువకుడు అదే ప్రాంతంలో నివాసముంటున్నఅగ్రకులానికి చెందిన ఓ యువతితో ప్రేమ ప్రయాణం కొనసాగించాడు. ఈ విషయం తెలిసిి యువతి కుటుంబీకులకు ఆగ్రహవేశాలకు లోనయ్యారు.. పక్క ప్లాన్ తో వారు యువకుడిపై చితకబాదారు. తీవ్రంగా గాయపడిన సాయిని ఇడ్చుకు వెళ్లి  రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. రోడ్డుపై పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాయిని చూసిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం సాయి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. 

మరో వైపు ఈ దాడి గురించి తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరువు దాడికి పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో కఠిన చట్టాలు ఉంటేనే ప్రేమికులకు రక్షణ ఉంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు..

Trending News