పసుపు కుంకుమ పథకం డబ్బులొచ్చేస్తున్నాయ్

అక్కా చెల్లెళ్లకు ఉగాది కానుకగా పసుపు-కుంకుమ

Last Updated : Apr 5, 2019, 03:01 PM IST
పసుపు కుంకుమ పథకం డబ్బులొచ్చేస్తున్నాయ్

గుంటూరు: ఏపీ సర్కార్ ప్రకటించిన పసుపు కుంకుమ పథకానికి ఎన్నికల సంఘం నుంచి లైన్ క్లియర్ అయిన నేపథ్యంలో రాష్ట్రంలో సోదరీమణులు శనివారం నుంచి పసుపు కుంకుమ డబ్బులు తీసుకోవచ్చు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు మన చెక్కులు చెల్లవంటున్నారు కానీ చెల్లని కాసులు ఆ పార్టీ నేతలే అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వచ్చే ఐదేళ్లలో మూడుసార్లు పసుపు-కుంకుమ ఇస్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు. బాపట్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 

బాపట్ల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ '' కోటి మంది చెల్లెళ్లు ఉన్న ఏకైక అన్నయ్యను తానే'' అని అన్నారు. రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలు చేశామని చెప్పుకొచ్చిన చంద్రబాబు.. భవిష్యత్‌లో పెన్షన్‌ను రూ.3వేలు చేస్తామని హామీ ఇచ్చారు.

Trending News