ఏపీలో మరో 76 మందికి కరోనా.. తాజాగా ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ రోజురోజుకూ కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఏపీలో తాజాగా 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మరో ఇద్దరు కరోనాతో మరణించారు.

Last Updated : Jun 2, 2020, 02:18 PM IST
ఏపీలో మరో 76 మందికి కరోనా.. తాజాగా ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ రోజురోజుకూ కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఏపీలో తాజాగా 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మరో ఇద్దరు కరోనాతో మరణించారు. ఈ రెండు కరోనా మరణాలు కర్నూలులో సంభవించాయి.   జూన్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే.. 

రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,567 శాంపిల్స్ పరీక్షించగా 76 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,118కు చేరింది. ఈ మొత్తం కేసులకుగానూ 2,169 మంది డిశ్ఛార్జ్ కాగా, ఇప్పటివరకూ కరోనా బారిన పడి 64 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 885 యాక్టీవ్ కేసులున్నాయి. వీరు అన్ని జిల్లాల్లోని కోవిడ్19 ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.  LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్

Image Credit: twitter/@ArogyaAndhra

ఈ తాజా పాజిటివ్ కేసులలో నెల్లూరులో 8 మంది తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో ఇప్పటివరకూ 112 మందికి కరోనా నిర్ధారించారు. ఇవన్నీ యాక్టీవ్ కేసులే కాగా, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారిని పరీక్షించగా 446 మందికి పాజిటివ్ గా తేలగా.. ఇందులో కొందరు కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 249 మంది చికిత్స పొందుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

Trending News