AP Schools Reopening: 2022-23 అకడమిక్‌ కేలండర్‌ విడుదల.. జులై 5 నుంచి పాఠశాలలు ఆరంభం!

Schools Reopen from july 5th in AP. 2022-23 విద్యా సంవత్సరానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 27, 2022, 09:43 AM IST
  • 2022-23 అకడమిక్‌ కేలండర్‌ విడుదల
  • జులై 5 నుంచి పాఠశాలలు ఆరంభం
  • దసరా సెలవులు సెప్టెంబరు 26 నుంచి
AP Schools Reopening: 2022-23 అకడమిక్‌ కేలండర్‌ విడుదల.. జులై 5 నుంచి పాఠశాలలు ఆరంభం!

AP Schools Reopen 2022-23: 2022-23 విద్యా సంవత్సరానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది. ఏపీలోని పాఠశాలలు జులై 5 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు ప్రతి ఏడాది జూన్‌ 12న పాఠశాలలు ఆరంభం అయి ఏప్రిల్‌ 23 వరకు కొనసాగేవి. అయితే అధికారులు ఈ ఏడాది కేలండర్‌లో మార్పులు చేశారు. 2022-23 విద్యా సంవత్సరం జులై 5 నుంచి పునఃప్రారంభమై వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో బడులు 220 రోజులు పని చేస్తాయి. 

2022-23 విద్యా సంవత్సరంలోని ప్రతి వారంలో ఒక్కో తరగతికి 48 పిరియడ్లు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయులు వారానికి 38-39 పిరియడ్లు బోధించాలి. 1-5 తరగతులకు మొదటి 40 రోజులు.. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి వరకు 30 రోజుల పాటు విద్యార్థులను సంసిద్ధం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రాథమిక విద్య, 1-2 తరగతులు ఉండే ఫౌండేషన్‌, 1-5 తరగతుల ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలలు పి ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు కొనసాగుతాయి. సాయంత్రం 3.30 నుంచి 4 వరకు ఆటలు. ఇక ప్రీ హైస్కూల్‌, హైస్కూల్‌, హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాల తరగతులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటాయి. సాయంత్రం 4 నుంచి 5 వరకు ఆటలు, పునశ్చరణ తరగతుల సమయం.

2022-23 విద్యా సంవత్సరంలోని విద్యార్థులకు దసరా సెలవులు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 6 వరకు ఉంటాయి. క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6 వరకు. క్రిస్మస్‌ సెలవులు డిసెంబరు 23 నుంచి జనవరి ఒకటి వరకు ఉన్నాయి. ఇక 2023 సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16 వరకు ఇస్తారు. 

ఫార్మెటివ్‌-1 పరీక్షలు సెప్టెంబరు 7 నుంచి 9 వరకు, ఫార్మెటివ్‌-2 పరీక్షలు అక్టోబరు 13, 14, 15 తేదీల్లో నిర్వహిస్తారు. సమ్మెటివ్‌-1 పరీక్షలు నవంబరు 21 నుంచి 30 వరకు జరుగుతాయి. ఫార్మెటివ్‌-3 పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 21, ఫార్మెటివ్‌-4 ఫిబ్రవరి 6 నుంచి 8 తేదీల్లో ఉంటాయి. ఇక పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు ఉంటాయి. 1-9 తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 13 నుంచి 27 వరకు ఉంటాయి.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు!

Also Read: Telangana Weather Forecast: తెలంగాణలో నేడు, రేపుఓ మోస్తరు వర్షాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News