బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్

తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకే పలువురు నేతలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలో బీజేపీ నేత సీఎం రమేశ్ (CM Ramesh Tested COVID Positive) చేరారు. తనకు కరోనా పాజిటివ్ అని సీఎం రమేశ్ స్వయంగా తెలిపారు.

Last Updated : Aug 7, 2020, 05:14 PM IST
  • తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారిన పలువురు నేతలు
  • తాజాగా ఈ జాబితాలోకి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్
  • తనకు కోవిడ్ పాజిటివ్ అని వెల్లడించిన నేత
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్

తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పలువురు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలో సీఎం రమేశ్ (CM Ramesh COVID Positive) చేరారు. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సీఎం రమేశ్‌‌ కరోనా బారిన పడ్డారు. సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. తనకు  కరోనా పాజిటివ్‌‌‌‌‌గా నిర్ధారణ అయినట్లు స్వయంగా ప్రకటించారు. Telangana: తాజాగా 2207 కరోనా కేసులు, 600 దాటిన మరణాలు

డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్‌లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ తనకు ఏ అనారోగ్య సమస్యలు లేవని, ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఎలుకలపై ఆ కోవిడ్19 వ్యాక్సిన్ సక్సెస్

Trending News