అమరావతిలో బాలల చిత్రాల పండగ

   

Last Updated : Nov 12, 2017, 07:11 PM IST
 అమరావతిలో బాలల చిత్రాల పండగ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అమరావతిలో బాలల చలన చిత్రోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాన్ని ఈ రోజు సినీనటి రోజారమణి, కలెక్టర్‌ లక్ష్మీకాంతంలు ఘనంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ చిత్రోత్సవంలో భాగంగా పిల్లల కోసం ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాపును నిర్వహించనున్నారు. పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ నుండి వచ్చే అధ్యాపకులు ఈ వర్క్ షాపును నిర్వహిస్తారు. అలాగే ఈ ఉత్సవంలో మూడు రోజుల పాటు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ దేశాల బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శించడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఉత్సవం నిర్వహించడానికి ప్రభుత్వం 15 లక్షల రూపాయలు కేటాయించింది. తొలి రోజు జరిగిన ఉత్సవ ప్రారంభోత్సవవానికి మేయర్‌ కోనేరు శ్రీధర్‌, కమిషనర్‌ నివాస్‌లు హాజరయ్యారు. దాదాపు 45 పాఠశాలలు ఈ ఉత్సవానికి హాజరవుతారని సమాచారం. ఈ చిత్రోత్సవానికి టాలీవుడ్ నటులు ఆదర్శ్, నిఖిల్ కూడా హాజరై పిల్లలతో కలిసి చిత్రాలను వీక్షించనున్నారు.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x