COVID-19 in AP: విజయవాడ, రాజమండ్రిలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు

ఏపిలో మరో రెండు కరోనావైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ రెండు పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటివరకు ఏపిలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది.

Last Updated : Mar 22, 2020, 01:20 AM IST
COVID-19 in AP: విజయవాడ, రాజమండ్రిలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు

విజయవాడ/రాజమండ్రి: ఏపిలో మరో రెండు కరోనావైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. శనివారం నమోదైన రెండు కోవిడ్ పాటిజివ్ కేసుల్లో ఒకటి విజయవాడలో కాగా మరొకటి రాజమండ్రిలో నమోదైంది. ఈ రెండు పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటివరకు ఏపిలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది. ఈనెల 17న ప్యారిస్ నుంచి ఢిల్లీకి వచ్చి.. ఢిల్లీ నుంచి విజయవాడకు (Coronavirus in Vijayawada) వచ్చిన ఓ 24 ఏళ్ల యువకుడికి కరోనా పరీక్షల్లో పాజిటీవ్ అని గుర్తించారు. అలాగే ఈనెల 18న లండన్ నుంచి హైదరాబాద్‌కి వచ్చి.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి (Coronavirus in Rajamahendravaram) వచ్చిన 22ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటీవ్ అని తేలిందని అధికారులు తెలిపారు. 

విజయవాడ ( Corona in Vijayawada), రాజమండ్రి (Coronavirus in Rajamundry) లో కరోనా కేసులు వెలుగుచూడటంతో అక్కడి ప్రజల్లో కరోనా వ్యాప్తిపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Trending News