COVID-19: కరోనాతో బీజేపి నేత, ఏపీ మాజీ మంత్రి మృతి

బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఇక లేరు. గత నెల రోజులుగా కరోనావైరస్‌తో ( Coronavirus ) బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న ఆయన ఇవాళ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు.

Last Updated : Aug 1, 2020, 06:29 PM IST
COVID-19: కరోనాతో బీజేపి నేత, ఏపీ మాజీ మంత్రి మృతి

విజయవాడ: బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఇక లేరు. గత నెల రోజులుగా కరోనావైరస్‌తో ( Coronavirus ) బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న ఆయన ఇవాళ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. 2014 సాధారణ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి బీజేపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీజేపి, టీడీపీ, జనసేన ఓ కూటమిగా ఏర్పడి విజయం సాధించిన నేపథ్యంలో బీజేపి తరపున ఆయనకు ఏపీ కేబినెట్‌లో మంత్రి పదవిని దక్కింది. అలా చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2018 వరకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాల రావు ( Paidikondala Manikyala Rao ) సేవలు అందించారు. Also read: Vizag crane tragedy: సీఎం జగన్ స్పందన

మాజీ మంత్రి మాణిక్యాల రావు మృతితో తాడేపల్లిగూడంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మాణిక్యాల రావు మృతిపై బీజేపి నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 

సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి:
మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనాతో చనిపోయారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్... మాణిక్యాల రావు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతపాన్ని తెలియజేశారు. Also read: 
BJP in AP: రాజధాని విషయంలో బీజేపి వైఖరి ఇదే

Trending News