డ్వాక్రా మహిళలకు జగన్ బంపర్ ఆఫర్

అనంతపురం జిల్లా పాపంపేటలో ఈ రోజు జగన్ తన పాదయాత్ర నిర్వహించారు.

Last Updated : Dec 12, 2017, 09:20 PM IST
డ్వాక్రా మహిళలకు జగన్ బంపర్ ఆఫర్

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ తన పాదయాత్రను ఈ రోజు అనంతపురం జిల్లా పాపంపేటలో కొనసాగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైపీసీ ప్రభుత్వం వస్తే మీ కొడుకు, మీ అన్నగా మహిళలందరికీ అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటే అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో నగదు రూపంలో చెల్లిస్తానని స్పష్టం చేశారు. 

టీడీపీ మాఫియాను తరిమికొడతాం..

గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ మాఫియా దోచుకుంటోందని.. రేషన్ కార్డులు, పింఛన్లు చివరకు మరుగుదొడ్డి మంజూరుకు కూడా టీడీపీ మాఫియా లంచాలు తీసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో మాఫియ రాజ్యమేలుతోందని..ఇలాంటి పరిస్థితులు మారాలంటే వైసీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని జగన్ పేర్కొన్నారు.

Trending News