వైఎస్ జగన్‌కి సవాల్ విసిరిన జేసీ దివాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. 

Last Updated : Apr 7, 2018, 03:58 PM IST
వైఎస్ జగన్‌కి సవాల్ విసిరిన జేసీ దివాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. జగన్‌కి ధైర్యం వుంటే వైఎస్సార్సీపీకి చెందిన ఏడుగురు ఎంపీలతో రాజీనామా చేయించాలని జేసీ దివాకర్ రెడ్డి జగన్‌కి సవాల్ చేశారు. ఒకవేళ వైఎస్ జగన్ తన సవాల్ స్వీకరించి వారి చేత రాజీనామా చేయించినట్టయితే, తాను కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడనని జేసీ స్పష్టంచేశారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఓ చోట ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మరీ టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్ర విమర్శలు చేయడంపై స్పందిస్తూ జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ వైఖరిని జేసీ తప్పుపట్టారు. 

శుక్రవారం ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న వైఎస్ జగన్ అక్కడే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ వేదికపై నుంచి సీఎం చంద్రబాబుకు సూటిగా ఏడు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. 

Trending News