టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ ఎంపీ బుట్టారేణుక

Last Updated : Oct 17, 2017, 11:54 AM IST
టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ ఎంపీ బుట్టారేణుక

అందరూ అనుకున్నట్లే జరిగింది. వైసీపీకి చెందిన కర్నూలు ఎంపీ బుట్టారేణుక అనుకున్న ముహుర్తానికి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవానం ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  స్వయంగా ఆమెను పచ్చ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలికారు. బుట్టా రేణుకతో పాటు వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి ప్రకాశ్ రెడ్డి కూడా అధికార తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.  రేణుక భర్త బుట్టా నీలకంఠ గతంలోనే టీడీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  కర్నూలు అభివృద్ధికి తాను కట్టుబడి వున్నానని తెలిపారు.

వైసీపీ మనోబలాన్ని దెబ్బతీసే వ్యూహం..

జగన్ పాదయాత్ర మొదలయ్యే నాటికి మరిన్ని వలసలను ప్రోత్సహించాలనే టీడీపీ స్కెచ్ రెడీ చేసుకుంది. మరికొన్ని రోజుల్లో అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత గుర్నాథరెడ్డి కూడా టీడీపీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. జగన్ పాదయాత్ర మొదలయ్యే సమయానికి పార్టీ మనోబలాన్ని దెబ్బతీసేందుకే మలివిడత ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సహిస్తోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.  

 

Trending News