పవన్ పార్టీ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఒక‌సారి పవర్‌లోకి రాకుండా మిస్ అయ్యాం. ఈసారి త‌ప్పకుండా వస్తాం.. ఒక్కొక్కరి దుమ్ముదులుపుతాం అని మెగా బ్రద‌ర్ నాగ‌బాబు అన్నారు.

Last Updated : Apr 23, 2018, 11:24 PM IST
పవన్ పార్టీ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఒక‌సారి పవర్‌లోకి రాకుండా మిస్ అయ్యాం. ఈసారి త‌ప్పకుండా వస్తాం.. ఒక్కొక్కరి దుమ్ముదులుపుతాం అని మెగా బ్రద‌ర్ నాగ‌బాబు అన్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఈ మూవీ ఆడియో ఫంక్షన్ మిలటరీ మాధవరం ఊరిలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాగబాబు పాల్గొని ఆడియో సీడీని విడుదల చేశారు.

ఈ సందర్భంగా మెగా బ్రదర్ మాట్లాడుతూ, అల్లు అర్జున్‌ మా కళ్ల ముందే పుట్టి పెరిగిన అబ్బాయి. చాలా మంచోడు. అతని చిన్నతనంలో అల్లు అరవింద్ తండ్రి అరవింద్‌ వీడు అమాయకుడు ఎలా ఎదుగుతాడో అనేవారు. కానీ బన్నీ గొప్పవాడు అవుతాడని నేను అప్పుడే అనుకున్నాను. ఇవాళ స్టైలిష్ స్టార్‌గా అల్లు అర్జున్‌ ఎంత ఎదిగాడో మీకందరికీ తెలుసు' అని అన్నారు.  ఆతరువాత తీవ్ర బావోద్వేగానికి గురైన నాగబాబు, 'అరవింద్‌ గారితో సహా మా అందరికీ జీవితాలు ఇచ్చింది అన్నయ్య చిరంజీవే. పవన్‌ కోట్లాది రూపాయలు, స్టార్‌ డమ్‌ త్యాగం చేసి ప్రజాసేవకు వస్తున్నారు. అలాంటి నిజాయితీ పరుడు వస్తే తమ పరిస్థితి ఏంటని కొందరు భయపడుతున్నారు.' అని అన్నారు. పవన్‌ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక, అతడి ఇమేజ్ ను దెబ్బతీయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. 'కుట్రలను బద్దలుకొట్టుకొనైనా పవన్‌ మీ ముందుకొస్తారు. మీ అందరి బాగు కోసం పవన్ ఆలోచిస్తున్నాడు. గతంలో ఒకసారి అధికారం మిస్ అయ్యాం. కానీ ఈసారి అలా జరగదు. ఈసారి వస్తే ఒక్కొక్కరి దుమ్ము దులిపేస్తాం..' అని నాగబాబు అన్నారు.

Trending News