బీజేపీ పోరు బాట; సీమలో రెండో రాజధాని ఏర్పాటు డిమాండ్

Last Updated : Feb 23, 2018, 03:36 PM IST
బీజేపీ పోరు బాట; సీమలో రెండో రాజధాని ఏర్పాటు డిమాండ్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ రోజు  రాయలసీమకు 'సంబంధించిన డిక్లరేషన్ ను ప్రకటిచింది. కర్నూలు వేదికగా జరిగిన సమావేశంలో ఈ మేరకు  డిక్లరేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా సీమలో రెండో రాజధాని ఏర్పాటు , హైకోర్టు నిర్మాణం డిమాండ్లు ఉన్నాయి.  రాయలసీమకు సంబంధించిన బీజేపీ డిక్లరేషన్ ను ఒక్కసారి పరిశీలిద్దాం

సీమ ప్రాంత బీజేపీ డిక్లరేషన్: 
* సీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలి
* హైకోర్టు సీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి
* రాయలసీమ అభివృద్ధి బోర్డు పున: ప్రారంభించాలి
* రాయలసీమను 8 జిల్లాలుగా విభజించాలి
* నాలుగేళ్ల పాలనలో సీమకు సంబంధించిన కేటాయింపులు ప్రకటించాలి
* రూ.10 వేల కోట్లు సీమ ఇరిగేషన్ కు కేటాయించాలి
* వచ్చే బడ్జెట్ రూ.20 వేల కోట్లు సీమ ప్రత్యేక నిధి కింద కేటాయించాలి
*  ఆరు నెలలకు ఒక సారి సీమలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి

ఈ డిమాండ్ సాధన కోసం ఈ నెల 28 నుంచి కడప జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ బీజేపీ నిర్ణయించింది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x