AP: జగన్ ఢిల్లీ పర్యటన వెనుక కారణాలివే..రాత్రి పది గంటలకు అమిత్ షాతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాత్రికి ప్రత్యేకంగా కలవనున్నారు. జగన్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటన చేపట్టడానికి కారణమేంటి..

Last Updated : Jan 19, 2021, 05:45 PM IST
AP: జగన్ ఢిల్లీ పర్యటన వెనుక కారణాలివే..రాత్రి పది గంటలకు అమిత్ షాతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాత్రికి ప్రత్యేకంగా కలవనున్నారు. జగన్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటన చేపట్టడానికి కారణమేంటి..

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ( Ap cm ys jagan ) హఠాత్తుగా ఢిల్లీ పర్యటన ( Delhi Tour ) కు వెళ్లారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఇవాళ రాత్రి 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ( Union home minister amit shah ) తో జగన్‌ భేటి కానున్నారు. అనంతరం ఇతర కేంద్రమంత్రులతో ముఖ్యంగా జలశక్తి మంత్రితో సమావేశమయ్యే అవకాశముంది. అమిత్ షాతో భేటీలో పలు కీలక విషయాల్ని చర్చించనున్నట్టు సమాచారం.  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించే అవకాశాలున్నాయి.

ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) నిర్ణయించిన మూడు రాజధానుల ( Ap three capital issue ) ఏర్పాటుకు సహకారం అందించాలని అమిత్‌షాను కోరనున్నారు. దీంతోపాటు ఏపిలో ఆలయాలపై దాడులు ( Attacks on temples ) , విగ్రహాల ధ్వంసంపై జరుగుతున్న రాజకీయ దుమారం గురించి చర్చించవచ్చు. ముఖ్యంగా బీజేపీ  ( Bjp ) ఈ విషయంలో రధయాత్రకు సన్నాహాలు చేస్తుండటం దీనికి కారణం. ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని జగన్.. హోంమంత్రి అమిత్ షాకు వివరించనున్నారు. విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ నివేదిక ఇవ్వనున్నారు. 

Also read: TDP vs YCP: చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడిన టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News