టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్.. వైసీపీ కీలక నేతలు జంప్ ?

Last Updated : Oct 6, 2017, 03:56 PM IST
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్.. వైసీపీ కీలక నేతలు జంప్ ?

వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని బలహీనం చేసే వ్యూహంలో భాగంగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను కొనసాగిస్తోంది. జగన్ పార్టీ బలంగా ఉన్న రాయలసీమ ప్రాంతంపై టీడీపీ ప్రధానంగా దృష్టిసారించింది. రెడ్డి సామాజిక వర్గ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ ముందుకు కదులుతోంది. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ తో  ఇప్పటికే రాయలసీమకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయంలో ఆదినారాయణరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, సీఎం రమేష్ తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్లు తెలిసింది.

రాయలసీమలో రెడ్డి సామాజికాన్ని ఆకర్షిస్తే వైసీపీ ఆటోమెటిక్ గా బలహీన పడుతుందనే వ్యూహంతో టీడీపీ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు వైసీపీ నేతలు, అనంతపురం జిల్లా నుంచి ఓ కీలక నేతలతో టీడీపీ నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు దాదాపు ఆ నేతలు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్న వారిలో ప్రధానంగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ముఖ్యనేతగా ఉన్న గురునాథ్ రెడ్డి , కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీ బుట్టారేణుక పేర్లు వినిపిస్తున్నాయి. 

Trending News