టీడీపి ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్.. ఏపీ హై కోర్టు నోటీసులు

టీడీపి ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్.. ఏపీ హై కోర్టు నోటీసులు 

Last Updated : Sep 22, 2019, 01:20 AM IST
టీడీపి ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్.. ఏపీ హై కోర్టు నోటీసులు

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ రావుకు ఏపి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేగా మద్దాలి గిరిధర్‌ రావు ఎన్నిక చెల్లందటూ స్థానిక వైసిపి నేత ఏసురత్నం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు వచ్చిన సందర్భంగా కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ ఏసురత్నం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎన్నికల్లో పోటీ సందర్భంగా నామినేషన్ అఫిడవిట్‌‌లో తప్పుడు వివరాలు సమర్పించి గిరిధర్‌ రావు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. గిరిధర రావు మొత్తం 5 పేర్లతో వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపించారు. 

ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో)తో కుమ్మక్కయిన గిరిధర్‌ రావు.. 4,040 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోల్‌ కాగా, 312 మాత్రమే చెల్లుబాటయ్యేలా చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్టాన్ని మోసం చేసి ఎమ్మెల్యేగా గెలిచినందున గిరిధర రావును వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏసురత్నం తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర రావుకు, ఆయనకు సహకరించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్వోకు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.

Trending News