నోరుజారిన టీడీపీ మహిళ నేత; జై జగన్ అంటూ నినాదం !!

ఎన్నికల వేళ నేతలు నోరు జారటం పరిపాటిగా మారింది.

Last Updated : Apr 9, 2019, 01:41 PM IST
నోరుజారిన టీడీపీ మహిళ నేత; జై జగన్ అంటూ నినాదం !!

ఇటీవలికాలంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వలసలు జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నుంచి వైసీపీకి...వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అయితే మారారు కానీ పాత అలవాట్లను మాత్రం చాలామంది నేతలు వదులుకోలేకపోతున్నారు. ఒక పార్టీలో ఉంటూ మరోక పార్టీలకు జై కొడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.

ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన కర్నూలు నేత గౌరు చరితా రెడ్డి ప్రచారం సందర్భంగా నోరు జారారు. పాణ్యంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా  ఈ ఎన్నికల్లో టీడీపీకే ఓటువేయాలని విజ్ఞప్తి చేస్తూ చివరగా జై జగన్ అని గట్టిగా నినాదం ఇవ్వడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు షాక్ కు గురయ్యారట. వెంటనే తేరుకున్న ఆమె మళ్లీ జై చంద్రబాబు అని చెప్పి తన తప్పును సరిదిద్దుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాకు పాకడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

 

 

Trending News