Vizianagaram Train Accident: విజయనగరం ఘోర రైలు ప్రమాదం, పెరుగుతున్న మృతుల సంఖ్య

Vizianagaram Train Accident: ఆంధఫ్రదేశ్ విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య  అంతకంతకూ పెరుగుతోంది. రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది మరణించగా100 మందికి పైగా గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2023, 08:13 AM IST
Vizianagaram Train Accident: విజయనగరం ఘోర రైలు ప్రమాదం, పెరుగుతున్న మృతుల సంఖ్య

Vizianagaram Train Accident: ఒడిశా మహానగ బజార్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరహాలోనే మరో రైలు ప్రమాదం సంభవించింది. బయలుదేరిన కాస్సేపటికే రెండు రైళ్లు ఒకదానికొకటి వెనుక నుంచి ఢ కొనడంతో మూడు భోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ఫలితంగా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 

ఒడిశా మహానగ రైలు ప్రమాదం ఘటన నుంచి రైల్వే శాఖ గుణపాఠం నేర్చుకోలేదు. అదే తరహాలో మరో రైలు ప్రమాదం సంభవించింది. ఏపీలోని విజయనగరం జిల్లాలో నెంబర ్08532 విశాఖపట్నం-పలాస రైలు కంటకాపల్లి స్టేషన్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు చినరావుపల్లి వద్ద ఆగిపోయింది. మూడు లైన్లు ఉండగా మధ్య లైనులో రైలు నిలిచింది. ఆ వెనుక కంటకాపల్లి నుంచి వస్తున్న08504 విశాఖపట్నం-రాయగఢ్ పాసెంజర్ వేగంగా ఢీకొట్టింది. దాంతో విశాఖ - పలాస వెనుక భాగంలోని రెండు భోగీలు, విశాఖ-రాయగడ్ మూడు భోగీలు ఒకదానిపై ఒకటి పడి నుజ్జునుజ్జయ్యాయి. కొన్ని భోగీలు పక్క ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలుపై పడ్డాయి. ఫలితంగా ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది మరణించగా, 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 35 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉందని సమాచారం.

రాత్రి సమయం కారు చీకట్లు అలముకోవడంతో సహాయక చర్యలు ఆలస్మమయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. నుజ్జునుజ్జయిన భోగీల్లో మరింతమంది ప్రయాణీకులు చిక్కుకుని ఉండవచ్చని తెలుస్తోంది. రెండు రైళ్లలో కలిపి దాదాపు 1400 మంది ప్రయాణీకులున్నట్టు సమాచారం. క్షతగాతుల్ని విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించారు. 

సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడమే కాకుండా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

Also read: Vizianagaram Train Accident Updates: 8 మంది మృతి.. 40 మందికిపైగా గాయాలు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News