ఊహాగానాలకు చెక్; మంత్రి పదవిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా రియాక్షన్ ఇదే..

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు ఏపీ సీఎం జగన్ ను కలిశారు

Last Updated : Jun 11, 2019, 09:40 PM IST
ఊహాగానాలకు చెక్; మంత్రి పదవిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా రియాక్షన్ ఇదే..

అమరావతి: మంత్రివర్గంలో చోటు దక్కలేదని రోజా అలిగినట్లు వస్తున్న వార్తలకు రోజా ఫుల్ స్టాప్ పెట్టారు. తనకు మంత్రి పదవి కన్నా జగన్ సీఎం కావడం ఆనందమని జగన్ పట్ల తన విధేయతను మరోసారి చాటుకున్నారు. ఈ రోజు ఆమె  సీఎం జగన్ ను కలుసుకున్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పదవులు రానంత మాత్రానా అలగడం, బుజ్జగింపులు వంటివి తమ పార్టీలో ఉండవని బదులిచ్చారు.

సీఎం జగన్ తో భేటీ వివరాల గురించి రోజా స్పందిస్తూ జగన్ ని మర్యాదపూర్వకంగా కలిశానని వివరించారు. సీఎం జగన్ తో భేటీలో ఇరువురి మధ్య అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగిందని వెల్లడించారు. మంత్రి పదవి ఇవ్వకపోవడం స్పందిస్తూ తాము పదవులకు ఆశించి పార్టీలోకి రాలేదని.ఏపీ ప్రజలకు రాజన్న రావాలి..జగన్ సీఎం కావాలని పోరాటం చేశామని తెలిపారు. మంత్రి పదవి ఎప్పుడు చేపడతారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు భవిష్యత్తులో చేపట్టవచ్చని నవ్వుతూ బదులిచ్చారు రోజా.

Trending News