ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీతో వైఎస్ జగన్ భేటీ

ప్రధాని మోదీతో వైఎస్ జగన్ భేటీ

Last Updated : May 26, 2019, 12:19 PM IST
ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీతో వైఎస్ జగన్ భేటీ

న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సుమారు గంటపాటు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన నరేంద్ర మోదీకి జగన్ అభినందనలు తెలియజేయగా.. ఏపీ ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న జగన్‌ని మోదీ అభినందించారు. తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా మోదీని వైఎస్ జగన్ కోరినట్టు సమాచారం. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కుంటున్న సమస్యలను మోదీ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.

ముఖ్యంగా రాష్ట్రం ఎదుర్కుంటున్న ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు వంటి అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా 9 మంది పార్టీ ఎంపీలు జగన్‌తోపాటు మోదీని కలిసిన వారిలో ఉన్నారు.


ప్రధాని మోదీని కలిసిన అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్ కి వెళ్లి అక్కడి అధికారులతో సమావేశం కానున్నారు.

 

Trending News