First phase panchayat elections 2021: తొలిదశలో అధికార పార్టీ హవా..82 శాతం వైసీపీ మద్దతుదార్లదే విజయం: మంత్రి బొత్స

First phase panchayat elections 2021: ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పంచాయితీ పోరు ముగిసింది. అధికార పార్టీ హవా స్పష్టంగా కన్పించింది. తొలిదశలో 82 శాతం పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారు. ఓటర్లకు మంత్రి బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

Last Updated : Feb 10, 2021, 04:46 PM IST
  • తొలిదశ పంచాయితీ ఎన్నికల్లో 82 శాతం విజయం వైసీపీ మద్దతుదారులదేనన్న మంత్రి బొత్స సత్యనారాయణ
  • వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారని చెప్పిన మంత్రి బొత్స
  • చంద్రబాబు వైఖరిపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ
First phase panchayat elections 2021: తొలిదశలో అధికార పార్టీ హవా..82 శాతం వైసీపీ మద్దతుదార్లదే విజయం: మంత్రి బొత్స

First phase panchayat elections 2021: ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పంచాయితీ పోరు ముగిసింది. అధికార పార్టీ హవా స్పష్టంగా కన్పించింది. తొలిదశలో 82 శాతం పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారు. ఓటర్లకు మంత్రి బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ( Welfare schemes ) గ్రామీణ ప్రజలు పట్టం కట్టారని..అందుకు నిదర్శనమే పంచాయితీ ఎన్నికలని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. తొలిదశ పంచాయితీ ఎన్నిక ( First phase panchayat elections )ల్లో 82 శాతం వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్దులే విజయం సాధించారని ఆయన చెప్పారు. తొలిదశలో జరిగిన 2 వేల 637 పంచాయితీ ఎన్నికల్లో దాదాపు 2 వేల పంచాయితీలను వైసీపీ సానుభూతిపరులు కైవసం చేసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana ) తెలిపారు. ఈ సందర్భంగా ఓట్లేసి గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu )పై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నోరు విప్పితే చాలు అన్నీ అబద్దాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పేదంతా అంకెల గారడీ తప్ప మరేదీ కాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ( Volunteer system ) తీసుకొస్తే..ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. సేవా దృక్ఫథంతో పనిచేసేవారికి 5 వేల గౌరవ వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ( Ap cm ys jagan ) ముందే చెప్పారన్నారు. ప్రతి ఇంటికీ మేలు చేయాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. సమాజంలో వాలంటీర్లకు మంచి గౌరవముందని..దాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. ఎవరో చెప్పిన మాటలు విని పక్కదారి పట్టవద్దని వాలంటీర్లకు విజ్ఞప్తి చేశారు. 

Also read: Supreme court: ఏపీ ప్రభుత్వానికి ఊరట, జస్టిస్ రాకేశ్ కుమార్ ఆదేశాలపై స్టే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News