పోలింగ్ కేంద్రం నుంచి ఓటర్లకు జగన్ విజ్ఞప్తి

పోలింగ్ కేంద్రం నుంచి ఓటర్లకు జగన్ చేసిన విజ్ఞప్తి

Last Updated : Apr 11, 2019, 11:08 AM IST
పోలింగ్ కేంద్రం నుంచి ఓటర్లకు జగన్ విజ్ఞప్తి

పులివెందుల: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి వైఎస్ భారతితో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనం మార్పు కోరుకుంటున్నారని అన్నారు. జనం కోరుకుంటున్న మార్పు సాధ్యపడాలంటే ఓటర్లు అంతా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకుని మార్పు కోసం ఓటు వేయాల్సిందిగా జగన్ విజ్ఞప్తి చేశారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్ జగన్ మరోసారి కూడా అక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్లేందుకు ఎన్నికల బరిలో నిలిచారు. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో తాను మరోసారి భారీ మెజారిటీతో గెలుస్తాననే ధీమా జగన్‌లో కనిపిస్తోంది. కేవలం పులివెందులలోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్‌లో దాదాపు మెజారిటీ స్థానాలు గెలుచుకుని ఈసారి ఎలాగైనా తామే అధికారం చేపడతామని వైఎస్సార్సీపీ అధినేత జగన్ చెబుతూవస్తున్న సంగతి తెలిసిందే. 

Trending News