MTNL Best Plan: రోజుకు 1 జీబీ డేటా, ఏడాది వ్యవధితో ఇంత చవకైన ప్లాన్ మరెక్కడా లేదు

MTNL Best Plan: ఆ కంపెనీ ప్రకటించిన అద్భుతమైన ఆఫర్ దిగ్గజ కంపెనీలకు చెమటలు పట్టించేసింది. కేవలం 150 రూపాయలకు ఏడాది వ్యాలిడిటీ ఇస్తుండటం అందరి మతి పోగొడుతోంది. ఆ ఆఫర్ ఏంటి, టెలీకం కంపెనీ పేరేంటనే వివరాలు చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2022, 10:15 AM IST
  • ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియాలను తలదన్నే అద్భుత ఆఫర్
  • 141 రూపాయలకే రోజుకు 1 జీబీ డేటా, 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్
  • ఎంటీఎన్ఎల్ నుంచి అద్భుతమైన చవకైన ప్లాన్
MTNL Best Plan: రోజుకు 1 జీబీ డేటా, ఏడాది వ్యవధితో ఇంత చవకైన ప్లాన్ మరెక్కడా లేదు

MTNL Best Plan: ఆ కంపెనీ ప్రకటించిన అద్భుతమైన ఆఫర్ దిగ్గజ కంపెనీలకు చెమటలు పట్టించేసింది. కేవలం 150 రూపాయలకు ఏడాది వ్యాలిడిటీ ఇస్తుండటం అందరి మతి పోగొడుతోంది. ఆ ఆఫర్ ఏంటి, టెలీకం కంపెనీ పేరేంటనే వివరాలు చూద్దాం.

ఇటీవలి కాలంలో టెలీకం కంపెనీలు మూకుమ్మడిగా ధరలు పెంచేస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు ప్లాన్స్ ధరలు పెంచడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో ఈ మూడు కంపెనీలు తక్కువ ధరతో చవకైన ప్లాన్స్ విడుదల చేశాయి. ఇప్పుడు మరో కంపెనీ ఈ మూడు కంపెనీలకు దిమ్మ తిరిగే ఆఫర్ ఇస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ కంపెనీ ప్రకటించిన ప్లాన్‌తో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలకు ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. 

ఈ కొత్త ప్లాన్ ప్రకటించింది ఎంటీఎన్ఎల్ కంపెనీ. 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్న అద్భుతమైన ప్లాన్ ఇది. అది కూడా కేవలం 141 రూపాయలకే. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది. 141 రూపాయల ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. దాంతోపాటు ఈ ప్లాన్‌లో తొలి 90 రోజులకు ప్రతిరోజదూ 1జీబీ డేటా ఉంటుంది. దాంతోపాటు ఎంటీఎన్ఎల్ నెట్వర్క్‌కు అన్‌లిమిటెడ్ కాలింగ్ వెసులుబాటు ఉంటుంది. 

ఇక ఇతర నెట్‌వర్క్‌కు కాల్ చేయాలంటే 2 వందల నిమిషాలు ఉచితంగా లభిస్తాయి. 2 వందల నిమిషాలు పూర్తయితే..నిమిషానికి 25 పైసలు ఛార్జ్ అవుతాయి. అది కూడా తొలి 90 రోజులకే. ఆ తరువాత మీకు ప్రతి సెకండ్ కు 0.02 పైసలు ఛార్జ్ అవుతాయి. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకూ ఇంత చవకైన ప్లాన్ ప్రకటించలేదు.

Also read: Gyanvapi masjid Issue: జ్ఞానవాపి మసీదులో కొత్త వివాదం, అడ్వకేట్ కమీషనర్ అజయ్ మిశ్రా వర్సెస్ విశాల్ సింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News