RBI New Rule: కొత్త పేమెంట్​ రూల్స్ అమలు జనవరి 1 నుంచి కాదు.. కొత్త తేదీ ఇదే..!

RBI New Rule: ఈ-కామర్స్, ఆన్​లైన్ వేదికలపై చెల్లింపులను సురక్షితం చేసేందుకు తెచ్చిన కొత్త నిబంధనల అమలు గడువును పెంచింది ఆర్​బీఐ. జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్స్​ను అమలు చేయాలని తొలుత భావించగా.. ఇప్పుడు ఆరు నెలలు గడువు పెంచింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 06:32 PM IST
  • కొత్త పేమెంట్ రూల్స్ అమలు గడుపు పెంచిన ఆర్​బీఐ
  • వచ్చే ఏడాడి జులై 1నుంచి తప్పనిసరి చేయాలని నిర్ణయం
  • అప్పటి వరకు పాత పద్దతిలోనే పేమెంట్స్​ కొనసాగింపు
RBI New Rule: కొత్త పేమెంట్​ రూల్స్ అమలు జనవరి 1 నుంచి కాదు.. కొత్త తేదీ ఇదే..!

RBI New Rule: ఆన్​లైన్​ చెల్లింపులను మరింత సురక్షితం (Safe online transactions) చేసేందుకు ఆర్​బీఐ (RBI new Rules) తీసుకొచ్చిన కొత్త రూల్స్ అమలు చేసే విషయంపై కొత్త అప్​డేట్ వచ్చింది. తాజాగా ఈ కొత్త రూల్స్​ అమలు తప్పనిసరి చేసే గడువును పొడగిస్తూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

కొత్త రూల్స్​ అమలు తప్పనిసరి చేసే తేదీ ఇంతకు ముందు 2022 జనవరి 1 గా ఉండగా.. ఇప్పుడు ఆ తేదీని 2022 జులై 1కి మార్చింది.

ఇంతకి ఏమిటి ఈ కొత్త రూల్స్..

ఈ-కామర్స్ దిగ్గజాలు, ఇతర ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లు తమ పేమెంట్ గేట్​వేలలో వినియోగదారుల క్రెడిట్​, డిబిట్​ కార్డ్​ల వివరాలు సేవ్​ చేసుకోకుండా నియంత్రించడమే ఈ కొత్త నిబంధనల (What are RBI new Rules) ఉద్దేశం. ఇందులో భాగంగా ఆయా సంస్థలు తమ గేట్​వేల నుంచి యూజర్ల పేమెంట్ వివరాల డేటా బేస్​ను తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఆర్​బీఐ.

ఈ ఆదేశాల ప్రకారం.. పేమెంట్ చేసే ప్రతి సారి వినియోగదారులు డెబిట్​, క్రెడిట్​ కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కాస్త ఇబ్బందితో కూడుకున్న విషయం కాబట్టి.. దీనికి బదులు టోకనైజేషన్ వాడుకోవచ్చని తెలిపింది.

టోకనైజేషన్ అంటే?

క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను బహిర్గతం చేయకుండా.. ఆన్​లైన్ షాపింగ్​,సహా ఇతర మాధ్యమాల్లో వాటిని వినియోగించేందుకు (What is Tokenisation) ఉపయోగపడేదే ఈ టోకనైజేషన్. పేమెంట్​ చేసే సమయంలో టోకనైజేషన్​ సదుపాయం ద్వారా కోడ్​ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది క్రెడిట్​, డెబిట్ కార్డ్​ సేవలందించే.. మాస్టర్, వీసా, రూపే వంటి పేమెంట్ సంస్థలు అందిస్తాయి.

ఇలా జెనరేట్ చేసిన కోడ్​నే టోకెన్ అంటారు. ఈ టెకెన్​ను పేమెంట్ కోసం వినియోగించుకోవచ్చు. పొరపాటున ఈ కోడ్​ బయటకు వచ్చిన ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే అదనపు అథెంటికేషన్ ద్వారా మాత్రమే ఈ పద్దతిలో లావాదేవీ పూర్తవుతుంది. కాబట్టి ఇది చాలా సురక్షితమని భావిస్తోంది (Tokenisation uses) ఆర్​బీఐ.

ఆయితే టోకనైజేషన్ వాడుకోవడం తప్పనిసరే కాదు. వినియోగదారులు ఇష్టమైతేనై ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. లేదా ప్రతి సారి మాన్యువల్​గా కార్డ్ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా పేమెంట్​ పూర్తి చేయొచ్చు. టోకనైజేషన్​ సేవలు పొందేందుకు ఎలాంటి ఛార్జీలు కూడా ఉండవు.

Also read: Year ending 2021: డిసెంబర్​ 31 సమీపిస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?

Also read: Bank Holidays December 2021: ఆరు రోజులు మూతపడనున్న బ్యాంకులు.. ఏఏ రోజుల్లో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News