2000 Notes: 2 వేల రూపాయల నోట్లు ఇంకా మిగిలున్నాయా, ఇలా మార్చుకోండి

2000 Notes: రద్దయిన 2 వేల రూపాయల నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన అప్‌డేట్ జారీ చేసింది. 2 వేల రూపాయల నోట్లు ఇంకా మార్చుకునేందుకు అవకాశముందా లేదా, ఇంకా 2 వేల రూపాయల నోట్లు మిగిలి ఉంటే ఏం చేయాలి..ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 2, 2024, 12:19 PM IST
2000 Notes: 2 వేల రూపాయల నోట్లు ఇంకా మిగిలున్నాయా, ఇలా మార్చుకోండి

2000 Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల రూపాయల నోట్లను రద్దు చేసి అప్పుడే ఏడాది దాటేసింది. గత ఏడాది మే 19వ తేదీన 2 వేల రూపాయల నోట్ల ఆర్బీఐ ఉపసంహరించుకుంది. అప్పటికే మార్కెట్‌లో ఉన్న 3.56 లక్షల కోట్ల నోట్లను మార్చుకునేందుకు 2023 సెప్టెంబర్ వరకూ గడువు ఇచ్చి ఆ తరువాత మరోసారి పొడిగించింది. అయినా ఇప్పటికీ 2 వేల రూపాయల నోట్లు మారకుండా మిగిలిపోయాయి. 

ఆర్బీఐ అంచనాల ప్రకారం మార్కెట్‌లో లేదా జనాల వద్ద 7 వేల కోట్ల 2 వేల రూపాయల నోట్లు మిగిలిపోయాయి. 98 శాతం నోట్లు ఆర్బీఐకు వెనక్కి వచ్చేశాయి. కానీ ఇంకా ఇప్పటికే 7,117 కోట్లు పింక్ నోట్లు మారకుండా ఉండిపోయాయి. 2 వేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదట్లో వేగంగా ఉండింది. కానీ ఇప్పుడు పూర్తిగా మందగించింది.  జూలై 1 నాటికి మార్కెట్‌లో 7581 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు ఉండిపోగా సెప్టెంబర్ 1 నాటికి ఈ సంఖ్య 7 వేల కోట్లకు తగ్గింది. అంటే రెండు నెలల్లో కేవలం 320 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లే వెనక్కి వచ్చాయి. గత ఏడాది అంటే 2023 మేలో పింక్ నోట్లను బ్యాన్ చేసినప్పుడు మార్కెట్‌లో 3.56  లక్షల కోట్ల నోట్లున్నాయి. గత ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 9,330 కోట్లకు తగ్గింది. 

ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంది. ప్రారంభంలో స్థానిక బ్యాంకులు, పోస్టాఫీసులు, 19 ఆర్బీఐ రీజనల్ కార్యాలయాల్లో మార్చుకునేందుకు అవకాశం ఉండగా ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పటికీ మీ వద్ద 2 వేల రూపాయల నోట్లు మిగిలిపోయుంటే మార్చుకునేందుకు ఇంకా అవకాశముంది. అయితే స్థానిక బ్యాంకుల్లో ఈ సౌకర్యం లేదు. దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో 7 వేల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు మిగిలిపోయాయి. ఇవి మార్చుకోవాలంటే అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగడ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ, పాట్నా తిరువనంతపురం కేంద్రాల్లో మార్చుకోవచ్చు.

Also read: 7th Pay Commission DA Hike: ఉద్యోగులకు దసరా కానుక, అక్టోబర్ 9న డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x