Assam Road Accident: ఘోర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి

Road Accident In Guwahati: అస్సాంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.  

Written by - Ashok Krindinti | Last Updated : May 29, 2023, 10:41 AM IST
Assam Road Accident: ఘోర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి

Road Accident In Guwahati: అస్సాంలోని గౌహతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గౌహతిలోని జల్కుబారి ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడగా.. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారందరూ విద్యార్థులేనని గౌహతి జాయింట్ పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నామని చెప్పారు. మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

 

రోడ్డు ప్రమాద ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. విద్యార్థులు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. జలుక్‌బరి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్వీట్ చేశారు. వారి తల్లిదండ్రులకు, కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తామని చెప్పారు. జీఎంసీహెచ్‌లో అధికారులతో మాట్లాడినట్లు సీఎం తెలిపారు. 

Also Read: CSK Vs GT Dream11 IPL Final Match Dream11 Prediction: ఐపీఎల్ ఫైనల్‌కు వేళయా.. గుజరాత్‌కు చెన్నై చెక్ పెడుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇవే..

Also Read: CSK Vs GT IPL 2023: క్షణాల్లో మ్యాచ్‌ మార్చేసే వీరులు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News