Devi Sri Prasad: మరోసారి దేవి శ్రీ ప్రసాద్ మ్యాజిక్.. ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ అంటూ అలరిస్తున్న రాక్ స్టార్

Ratnam: దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతగానో ఆకట్టుకున్న పాటలు ఇచ్చిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు కూడా.. క్యాచీగా ఉండే పదాలు వచ్చే సాంగ్స్ ఇవ్వడంలో ముందుంటారు. అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఇప్పుడు విశాల్ రత్నం కోసం ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ అనే మంచి మాస్ బీట్ ఇచ్చారు దేవీ శ్రీ ప్రసాద్.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2024, 02:19 PM IST
Devi Sri Prasad: మరోసారి దేవి శ్రీ ప్రసాద్ మ్యాజిక్.. ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ అంటూ అలరిస్తున్న రాక్ స్టార్

Vishal: క్యాచీగా ఉండే పదాలు వచ్చే సాంగ్స్ కి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. ఇప్పుడు అదే ఫార్ములాని విశాల్ సినిమా రత్నం కి కూడా ఫాలో అయిపోతున్నాడు. మాస్ హీరో విశాల్ సినిమాలకు తమిళం తో పాటు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో విశాల్‌కు మంచి డిమాండ్ ఉంది. విశాల్ సినిమాలు అంటే అందరికీ యాక్షన్ సినిమాలే గుర్తుకు వస్తాయి. అలాంటిది యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తగ్గట్టుగానే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘రత్నం’ మూవీ ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతోంది. 

జీ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి డైరెక్టర్‌గా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి  దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ టీజర్‌, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే పాటను రిలీజ్ చేశారు. కాలేజ్‌లో విద్యార్థుల మధ్య రిలీజ్ చేసిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్ అవుతోంది. పాటను రిలీజ్ చేసిన అనంతరం విశాల్ మాట్లాడుతూ.. ‘స్టూడెంట్స్ మధ్య కాలేజ్‌లో మా పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. డోంట్ వర్రీ మచ్చి.. ఎగ్జామ్స్ కోసం డోంట్ వర్రీ మచ్చి.. కష్టాలు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ప్రతీ హీరోకి దేవీ శ్రీ ప్రసాద్‌ అదిరిపోయే పాట ఒక్కటైనా తప్పకుండా ఇస్తాడు. నాకు కూడా అలాంటి పాటను ఇవ్వమని అడిగాను. హరి నా జీవితాన్ని చూసి ఈ పాటను రాయించాడా? అని అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

శ్రీమణి రాసిన ఈ ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ పాటను దేవీ శ్రీ ప్రసాద్ సొంతంగా పాడడం విశేషం. కాగా ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు.

Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు

Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News