51 ఏళ్ళ ప్రేమబంధం..!

                 

Last Updated : Oct 12, 2017, 04:51 PM IST
51 ఏళ్ళ ప్రేమబంధం..!

ప్రేమ బంధం వికసించింది.. ప్రణయ బంధం మరో కొత్త జీవిత అధ్యాయానికి నాంది పలికింది. ప్రముఖ చలనచిత్ర నటుడు దిలీప్ కుమార్, తన సతీమణి సైరాభానుల వివాహ బంధం 51 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆయన ట్విటర్ ద్వారా తన ఆలోచనలను పంచుకున్నారు. తమ జీవన పయనం అందంగా సాగుతున్నందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. దిలీప్ కుమార్, సైరాభానుల వివాహం 1966లో జరిగింది. గోపి, బైరాగ్ లాంటి సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించాక, వీరు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. తనకంటే 22 సంవత్సరాల చిన్నదైన సైరాభానును పెళ్లాడిన దిలీప్, ఆ విషయంలో పలు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. దిలీప్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న సమయానికే సైరాభాను బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా వార్తల్లోకెక్కారు. ప్రస్తుతం 90వ పడిలోకి అడుగుపెట్టిన దిలీప్ కుమార్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నంతకాలం తన భర్తతో పాటు ఆమె కూడా అతని చెంతే ఉండేవారు. తమ 51వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆమె తమ నివాసమైన పాలీ హిల్ రెసిడెన్సీలో బాలీవుడ్ ప్రముఖలకు విందు నిర్వహించారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా మొదలైన బాలీవుడ్ ప్రముఖులు దిలీప్ కుమార్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

 

Trending News