Devara: రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్.. ఎవరైతే సృష్టించారో తానే మళ్లీ..!

NTR breaks Rajamouli Myth: దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా,  బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు. ఇక ఇప్పుడు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. గతంలో రాజమౌళి పై పడ్డ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ దేవర సినిమాతో బ్రేక్ చేశారని చెప్పవచ్చు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 27, 2024, 09:51 AM IST
Devara: రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్.. ఎవరైతే సృష్టించారో తానే మళ్లీ..!

Devara Review: తెలుగు చలనచిత్ర పరిశ్రమ గుర్తింపును ఎల్లలు దాటించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అందించిన ఏకైక డైరెక్టర్ రాజమౌళి గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. శాంతి నివాసం అనే సీరియల్ ఎపిసోడ్ ద్వారా కెరియర్ మొదలుపెట్టిన రాజమౌళి ,ఆ తర్వాత ఎన్టీఆర్ ను  హీరోగా పెట్టి స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ లాంటి చిత్రాలు చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.

ముఖ్యంగా విక్రమార్కుడు, మగధీర, ఈగ వంటి చిత్రాలతో కూడా విజయం సాధించిన ఈయన,  ఈ చిత్రాలతో కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమయ్యారు. కానీ ప్రభాస్ , రాణా లతో కలసి ఎప్పుడైతే మల్టీస్టారర్ మూవీ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారో.. అప్పటి నుంచి తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటిందనే చెప్పాలి.

అంత పేరు తెచ్చుకున్న రాజమౌళి పై కూడా ఒక నెగిటివ్ సెంటిమెంట్ వెంటాడుతూనే ఉంది. ఆ నెగిటివ్ సెంటిమెంట్ ని ఇప్పుడు ఎన్టీఆర్ తొలగించేసారని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే,  రాజమౌళితో చేసిన తర్వాత హీరో ఎవరైనా సరే ఇంకో డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేస్తే ఖచ్చితంగా ఆ సినిమా డిజాస్టర్ గా నిలుస్తోంది. ఉదాహరణకు బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో డిజాస్టర్ గా నిలిచింది. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. 

ఇప్పుడు ఎన్టీఆర్ కూడా దేవర సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఈరోజు ఉదయం విడుదలైన ఈ సినిమా  బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మొత్తానికైతే ఎన్టీఆర్  రాజమౌళి పై పడ్డ నెగటివ్ సెంటిమెంట్ ను కాస్త చెరిపేశారు. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. మొత్తానికైతే రాజమౌళి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేశారని చెప్పవచ్చు. 

ఇకపోతే ఈ విషయం తెలిసి మహేష్ బాబు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన తదుపరి సినిమా డిజాస్టర్ అయితే తట్టుకోలేమని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో,  ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి మహేష్ అభిమానులకు ఊరట కల్పించారు. కాగా రాజమౌళి కొడుకు కార్తికేయ సైతం.. ఎవరైతే రాజమౌళి సెంటిమెంటరీ సృష్టించారో అతనే మళ్లీ బ్రేక్ చేశారు అంటూ ట్వీట్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.

 

Also Read: Sobhita Chaitanya: నాకు నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాల

Also Read: KTR Comments on Devara: దేవర ఈవెంట్ రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News