కళ్యాణ్ రామ్ రాజకీయగుర్తు "ట్యాప్"

  

Last Updated : Nov 8, 2017, 05:53 PM IST
కళ్యాణ్ రామ్ రాజకీయగుర్తు "ట్యాప్"

నందమూరి కళ్యాణ్ రామ్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న "ఎంఎల్‌ఏ" చిత్రంలో రాజకీయ నాయకుడిగా నటిస్తున్నారు. అందులో ట్యాప్ గుర్తుకే ఓటేయమని హీరో కోరుతూ ప్రచారం చేస్తున్న సన్నివేశాలు ఇటీవలే ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించారు. ట్యాప్ గుర్తు ఉన్న జెండా పట్టుకొని కళ్యాణ్‌రామ్ ఆ షూటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిర్మాతలు. బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆగడు, బాద్షా, దూకుడు, బ్రూస్లీ, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి చిత్రాలకు కథా సహకారం అందించిన ఉపేంద్ర, "ఎంఎల్‌ఏ" చిత్రంతో తొలిసారిగా మెగాఫోన్ పట్టబోతున్నారు. 

Trending News