Kottayam Pradeep: 'ఏం మాయ చేశావే' నటుడు ప్రదీప్ కొట్టాయం కన్నుమూత.. సీఎం సంతాపం..

Kottayam Pradeep Passes Away:  మలయాళ హాస్య నటుడు ప్రదీప్ కొట్టాయం గుండెపోటుతో కన్నుమూశారు. ప్రదీప్ కొట్టాయం మృతిపై కేరళ సీఎం సంతాపం ప్రకటించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 03:23 PM IST
  • మలయాళ నటుడు ప్రదీప్ కొట్టాయం కన్నుమూత
  • గుండెపోటుతో కన్నుమూసిన కమెడియన్
  • సంతాపం ప్రకటించిన కేరళ సీఎం విజయన్
Kottayam Pradeep: 'ఏం మాయ చేశావే' నటుడు ప్రదీప్ కొట్టాయం కన్నుమూత.. సీఎం సంతాపం..

Kottayam Pradeep Passes Away: మలయాళ నటుడు ప్రదీప్ కేఆర్ (61) అలియాస్ కొట్టాయం ప్రదీప్ గురువారం (ఫిబ్రవరి 17) గుండెపోటుతో కన్నుమూశారు. ప్రదీప్ కొట్టాయం మరణం మాలీవుడ్ ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తింది. ప్రదీప్ మరణంపై పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు.

ప్రదీప్ కొట్టాయం 40 ఏళ్ల వయసులో 2001లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 70 సినిమాల్లో నటించిన ప్రదీప్.. ఎక్కువగా కామెడీ పాత్రల్లోనే కనిపించారు. మొదట్లో ప్రదీప్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమయ్యారు. ఐవీ శశి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ నదు ఇనలే వారే' ఆయన తొలి సినిమా. రాజమాణిక్యం, హరిహర్ నగర్, అదు ఒరు భీగర జీవి ఆను, ఒరు వదక్కన్ సెల్ఫీ, లైఫ్ ఆఫ్ జోసుట్టీ, కుంజీ రామాయణం తదితర చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

ప్రదీప్ కొట్టాయం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగు సూపర్ హిట్ మూవీ 'ఏం మాయ చేశావే'లో జార్జ్ అంకుల్ పాత్రలో ప్రదీప్ నటించారు. ప్రదీప్ మరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం ప్రకటించారు. ప్రదీప్ అద్వితీయమైన నటుడని... అతను నటించిన చిన్న పాత్రలు సైతం ప్రేక్షకులకు ఎంతగానో గుర్తుండిపోయాయని... అందుకు అతని నటనే కారణమని అన్నారు. ప్రదీప్‌కు భార్య మాయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read: Goa Covid Vaccination: వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రాష్ట్రంగా గోవా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News