Double iSmart: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదల.. ఎంటర్టైన్మెంట్ డబుల్.. అంచనాలు కూడా డబుల్..!

Double iSmart Trailer: భారీ అంచనాల మధ్య పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. టైటిల్ కి తగ్గట్టుగానే యాక్షన్, ఎంటర్టైన్మెంట్ రెండూ ఈ సినిమాలో డబుల్ ఉంటాయని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 4, 2024, 08:25 PM IST
Double iSmart: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదల.. ఎంటర్టైన్మెంట్ డబుల్.. అంచనాలు కూడా డబుల్..!

Double iSmart Trailer Talk: రామ్ పోతినేని హీరోగా.. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన.. ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాలో.. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేసిన చిత్ర బృందం.. సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. రెండున్నర ఆరు నిమిషాల నిడివి ఉన్న సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మొదలవడమే రామ్ పోతినేని నేను ఎవరో తెలుసా అంటూ ప్రశ్నించగా.. బ్యాక్ గ్రౌండ్ లో బ్రెయిన్ లో యూఎస్బీ పెట్టుకుని తిరుగుతున్న ఇడియట్ అంటూ గొంతు వినిపిస్తుంది. అంతేకాకుండా రామ్ తనని తాను ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ అంటూ పరిచయం చేసుకుంటాడు. సంజయ్ దత్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపిస్తారు. ట్రైలర్ చూస్తే సంజయ్ దత్ పాత్ర తన బ్రెయిన్ లో ఉన్న మెమరీ మొత్తం.. డబుల్ ఇస్మార్ట్ బ్రెయిన్ లోకి పంపాలని ప్రయత్నిస్తారని తెలుస్తుంది. 

ఈ నేపథ్యంలోనే హీరోయిన్ పాత్రని వాడుకుంటారు అని కూడా అర్థం అవుతోంది. ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగిన డబ్బులు ఇస్మార్ట్ ట్రైలర్ చూస్తే.. సినిమా కూడా టైటిల్ కి తగ్గట్టుగానే.. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, రొమాన్స్ అని డబుల్ గానే ఉంటాయని తెలుస్తోంది. ఇక సినిమా ట్రైలర్ తో అంచనాలు కూడా డబుల్ అయిపోయాయి. 

 

అలీ, రోహిణీల కామెడీ కూడా వర్కౌట్ అయ్యేలాగానే కనిపిస్తోంది. మరి భారీ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకోగలదో వేచి చూడాలి. శియాజీ షిండే, మకరంద దేశ్ పాండే, ఉత్తేజ్, గెటప్ శ్రీను తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. పూరి కనెక్స్ పతాకంపై పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి.. మణిశర్మ సంగీతాన్ని అందించారు.

Read more:Snake vs Lizard: మానిటర్ బల్లిని కసితీరా కాటు వేసిన నల్ల పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x