రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునె గోవాలో బంగ్లా కొన్నారా ?

Last Updated : Jan 10, 2018, 10:49 PM IST
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునె గోవాలో బంగ్లా కొన్నారా ?

ఇటీవలే ఇరు కుటుంబాలతో కలిసి మాల్దీవులకి వెళ్లిన రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ ప్రేమ జంట పెళ్లికి ఇంట్లోనూ అభ్యంతరాలు లేవని, ఆ రెండు కుటుంబాలు కలిసి మాల్దీవులకి వెళ్లడమే అందుకు సాక్ష్యం అని మీడియా సైతం కోడైకూసింది. ఇదిలావుండగానే తాజాగా ఈ ప్రేమ జంట గోవాలో ఓ ఖరీదైన బంగ్లా సైతం కొనుగోలు చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఓ వైపు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునె పెళ్లి చేసుకోబోతున్నారట అని మీడియాలో ఇన్ని కథనాలు వెలువడుతున్నా.. అదేమీ పట్టించుకోకుండా ఆ ఇద్దరూ కలిసి గోవాలో ఓ బంగ్లా సొంతం చేసుకున్నట్టు సమాచారం.

ముంబై మిర్రర్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం గోవాలో వీళ్లిద్దరూ కలిసి కొనుక్కున్న బంగ్లా పక్కనే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ఇండియన్ ఫేమస్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ లాంటి ప్రముఖుల బంగ్లాలు వున్నట్టు తెలుస్తోంది. అయితే, వాళ్లిద్దరి పెళ్లి వార్తని ఖండించినట్టుగానే ఈ బంగ్లా కొనుగోలు విషయాన్ని కూడా ఖండించాడు రణ్‌వీర్ సింగ్ మీడియా అధికార ప్రతినిధి. కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఇన్నిసార్లు వీళ్ల పెళ్లి గురించి వార్తలొస్తున్నాయంటే అందులో ఎంతో కొంత వాస్తవం వుండే వుంటుందంటున్నాయి మీడియా కథనాలు.

Trending News