Sushant death case: సుశాంత్ మృతి కేసులో కీలక పరిణామం

Sushant Singh Rajput's death case: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని... తన కొడుకు మృతి వెనుక కుట్ర కోణాలు దాగి ఉన్నాయని ఇప్పటికే పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సుశాంత్ తండ్రి కెకె సింగ్.. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కి మరో విజ్ఞప్తి చేశారు.

Last Updated : Aug 4, 2020, 12:17 PM IST
Sushant death case: సుశాంత్ మృతి కేసులో కీలక పరిణామం

Sushant Singh Rajput's death case: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని... తన కొడుకు మృతి వెనుక కుట్ర కోణాలు దాగి ఉన్నాయని ఇప్పటికే పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సుశాంత్ తండ్రి కెకె సింగ్.. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కి మరో విజ్ఞప్తి చేశారు. సుశాంత్ మృతి కేసులో సీబీఐ చేత దర్యాప్తు చేయించాల్సిందిగా కెకె సింగ్ సీఎం నితీశ్ కుమార్‌ని ( Bihar CM Nitish Kumar ) కోరారు. తన ఫిర్యాదుపై పాట్నా పోలీసులు స్పందించి కేసు దర్యాప్తు కోసం ముంబై వెళ్లినప్పటికీ.. అక్కడ ముంబై పోలీసుల నుంచి బిహార్ పోలీసులకు సరైన సహకారం లభించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో కెకె సింగ్ బీహార్ సీఎం నితీశ్ కుమార్ సహాయం కోరడం చర్చనియాంశమైంది. Also read: Ram mandir: భూమి పూజ తొలి ఆహ్వానం అందుకుంటున్న ఇక్బాల్ ఎవరు ?

Trending News