Yash: యాష్ పుట్టినరోజు తీవ్ర విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి

Yash Birthday: కన్నడ స్టార్ హీరో కేజిఎఫ్ ఫేమ్ యాష్.. అదేనండి మన రాఖీ బాయ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఒక అపశృతి చోటు చేసుకుంది. తభ అభిమానాన్ని చాటుకోవడానికి ఫ్లెక్సీ కడుతున్న అభిమానులు ముగ్గురు మరణించడంతో కన్నడ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2024, 01:10 PM IST
Yash: యాష్ పుట్టినరోజు తీవ్ర విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి

Tragic Incident at Yash Birthday Event: ఒక సినిమా తో అన్ని ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించిన హీరో యాష్. ఈ కన్నడ యాక్టర్ కేజిఎఫ్ మూవీ తో వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ అంత ఇంత కాదు. భారీ కట్ అవుట్ తో అంతకంటే భారీ యాక్షన్ సన్నివేశాలలో నటించి ఎందరో మనసులు దోచుకున్నాడు. కాగా ఈరోజు యాష్ పుట్టినరోజు. తమ అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమానులు ఉత్సాహం కనబరిచారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా అనుకోని ఒక ఆపశృతి చోటు చేసుకుంది.

యాష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ.. అయితే నిజానికి ఈ రెండు పేర్ల కంటే కూడా రాఖీ భాయ్ అనే పేరు అతనికి పర్మనెంట్ గా సెట్ అయిపోయింది. 2007లో వచ్చిన ‘జంబడ హుడుగి’ అనే మూవీ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యాష్. ఆ తర్వాత 2008లో రాకీ..2013 లో ‘గూగ్లీ’లాంటి చిత్రాలు చేశాడు. అయితే అతనికి 2014లో వచ్చిన ‘మిస్టర్ అండ్ మిస్ రామాచారి’మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కేజిఎఫ్ చిత్రంతో ఒక విలక్షణమైన నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతను తన సరికొత్త ప్రాజెక్టు టాక్సిక్ మూవీ కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు.ఈ చిత్రాన్ని మలయాళ క్రేజీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10 కి విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

బాగా ఈరోజు యాష్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. యాష్ బ్యానర్ కడుతూ అనుకోకుండా ప్రమాదవశాత్తు అతని అభిమానులు ముగ్గురు మృతి చెందారు. యాష్ 38వ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు భారీ ఎత్తున జరపటానికి అతని అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే అనుకోకుండా బ్యానర్ కడుతూ విద్యుత్ ఘాతానికి గురి అయినప్పుడు అభిమానులు తుది శ్వాస విడిచారు.

యాష్ నేడు తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.. అందుకని కర్ణాటకలోని గడగ్‌ (Gadag) జిల్లాలో అతని అభిమానులు కొందరు అతనికి సంబంధించిన బ్యానర్ ని ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలియపరచాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో బ్యానర్ ని సెట్ చేసే సమయంలో.. అనుకోకుండా విద్యుత్ ఖాతానికి గురి అయి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

బాధితులను వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు చికిత్స కోసం తరలించారు. ట్రీట్మెంట్ తర్వాత వీరి ఆరోగ్యం ఎలా ఉందో తెలుస్తుంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన కన్నడ సినీ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. 

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

Also Read: Sneha: మోదరన్ డ్రెస్సులు స్నేహ…చెక్కుచెదరని అంటోన్న అభిమానులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News