Krithi Shetty: చందమామలా మెరిసిపోతున్న కృతి శెట్టి.. బేబమ్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా!

Krithi Shetty Latest Pics shakes internet. తాజాగా కృతి శెట్టి పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఫోటోలలో కృతి చందమామలా మెరిసిపోతున్నారు. బేబమ్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 12:56 PM IST
  • చందమామలా మెరిసిపోతున్న కృతి శెట్టి
  • బేబమ్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా
  • బేబమ్మకు రూ. 60 లక్షల పారితోషికం
Krithi Shetty: చందమామలా మెరిసిపోతున్న కృతి శెట్టి.. బేబమ్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా!

Tollywood Actress Krithi Shetty Looking gorgeous in Latest PhotoShoot: కృతి శెట్టి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన 'ఉప్పెన' సినిమాతో కృతి తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఉప్పెన సినిమాలో బేబమ్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కృతిని చూడడానికే సినిమాకు వెల్లారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఒక్క సినిమాతో కృతి పెద్ద స్టార్ అయిపోయారు. ఉప్పెన సినిమా ఇచ్చిన పాపులారిటీతో కృతికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. 

ఉప్పెన తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో కృతి శెట్టి నటించారు. ఆ సినిమాలో మోడ్రన్ అమ్మాయి ప్రేక్షకులను పాత్రలో అలరించారు. నానికి లిప్ లాక్ ఇచ్చి పెద్ద సంచలనం సృష్టించారు. ఆపై కింగ్ నాగార్జున, నాగ చైతన్య జతగా వచ్చిన మల్టీస్టారర్ సినిమా 'బంగార్రాజు'లో నటించారు. చైతూకి జోడిగా నాగలక్ష్మి పాత్రలో కృతి పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా చేశారు. ఈ సినిమాతో కృతి హ్యాట్రిక్ విజయం ఖాతాలో వేసుకున్నారు. 

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, తమిళ డైరెక్టర్ లింగుసామితో కాంబోలో 'ది వారియర్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టి ఎంపికయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా  జూలై 14న రిలీజ్ కానుంది. 

మరోవైపు సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో తెలంగాణ పల్లెపడుచు పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాకు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా కోసం బేబమ్మ రూ. 60 లక్షల పారితోషికం తీసుకుందని సమాచారం. ఉప్పెన కోసం రూ. 6 లక్షల పారితోషకం తీసుకున్న కృతి.. ఇపుడు రూ. 60 లక్షలు తీసుకునే వరకు వచ్చారు. 

యువ హీరోయిన్ కృతి శెట్టి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఫోటోలలో కృతి చందమామలా మెరిసిపోతున్నారు. బేబమ్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

Also Read: Akkireddy Gudem: పోరస్ కెమికల్ ఫ్యాక్టరీని తరలించాలని స్థానికుల ఆందోళన... అడ్డుకున్న పోలీసులు...

Also Read: Mumbai Indians: ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన... చెత్త రికార్డును మూటగట్టుకున్న ముంబై...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News