Adipurush VFX scene : 500 కోట్లు వేస్ట్ అనిపించిన యూట్యూబర్.. పాపం ఓం రౌత్ ను ఆడుకుంటున్నారుగా!

Youtuber recreates  Adipurush's VFX scene: ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ ట్రోలింగ్ మరో మారు తెర మీదకు వచ్చింది, దానికి కారణం ఒక యూట్యూబర్ ఒక లో బడ్జెట్ వీఎఫ్ఎక్స్ ఫిలిం చూపించేయడమే.     

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 28, 2022, 03:54 PM IST
Adipurush VFX scene : 500 కోట్లు వేస్ట్ అనిపించిన యూట్యూబర్.. పాపం ఓం రౌత్ ను ఆడుకుంటున్నారుగా!

Youtuber recreates Prabhas Adipurush's Underwater VFX scene: ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రామాయణ గాధ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. రాఘవ అంటూ రామున్ని పోలిన పాత్రలో ప్రభాస్ కనిపిస్తూ ఉండగా సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించగా రాముడు సోదరుడు లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు.

హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్న ఈ సినిమాని 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో టి సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి దానిమీద పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరిగాయి. చిన్నపిల్లల కార్టూన్ సినిమాలను పోలినట్లుగా ఈ టీజర్ ఉందని, అసలు ఏ మాత్రం క్వాలిటీ లేని గ్రాఫిక్స్ వర్క్ తో ఇన్ని కోట్ల రూపాయల సినిమా ఎలా చేస్తున్నారని, ట్రోలింగ్స్ పెద్ద ఎత్తున బయటకు వచ్చాయి.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by K U N W ∆ R (@itx_kunwar)

అయితే ఈ విషయంలో టీం ముందు జాగ్రత్త చర్యగా తమ సినిమా త్రీడీలో చూస్తేనే బాగుంటుందని చెబుతూ హైదరాబాద్ లో మీడియాకు త్రీడీ టీజర్ చూపించడమే కాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని థియేటర్లలో కూడా 3డీ టీజర్ ప్రదర్శించారు. అయితే ఇలా త్రీడీలో చూస్తే మాత్రమే స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండేలాగా సినిమా చేస్తే కష్టం అనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా 3డీ సినిమా ప్రదర్శించగల థియేటర్ల సంఖ్య చాలా తక్కువ.

ఆ ధియేటర్లతో త్రీడి సినిమా చూపించి కలెక్షన్లు కొల్లగొట్టడం అనేది అసాధారణమైన విషయమే. ఈ విషయం బోధ పడడంతో టీం జాగ్రత్త పడి నార్మల్ వర్షన్ కూడా విజువల్ గా బాగా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే సినిమా రిలీజ్ కూడా వాయిదా వేసుకున్నారు.  ఇప్పుడు మరోసారి ఆది పురుష్ సినిమా మీద ట్రోలింగ్స్ మొదలయ్యాయి. దానికి కారణం ఒక యూట్యూబర్  చాలా సింపుల్ గా ఒక విఎఫ్ఎక్స్ వీడియో తయారు చేసి వదలడమే. ఈ టీజర్ లో ప్రభాస్ నీటి లోపల కూర్చుని ధ్యానం చేసుకున్న సీన్ ని సదర్ యూట్యూబర్ రీ క్రియేట్ చేశాడు. అంతేకాక అది ఎలా చేయవచ్చు అనేది కూడా అతను స్టెప్ బై స్టెప్ చేసి చూపించాడు.

ఇక ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఆయన అద్భుతంగా చేశాడని మెచ్చుకుంటూనే సినిమా కోసం 500 కోట్లు ఖర్చు పెట్టడం టి సిరీస్ సంస్థ మూర్ఖత్వమే అని కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి సినిమాని జనవరి 2023 సందర్భంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడు జూన్ 16న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన అయితే వెలువడింది. తెలుగులో ఈ సినిమాని ప్రభాస్కు చెందిన యు వి ప్రొడక్షన్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. 

Also Read: Anupama Parameswaran Hot Photos: ఇలా కూడా అబ్బాయిలను టీజ్ చేయచ్చా..ఇదేం పని అనుపమా?

Also Read: Nithin Movie: పుష్ప బాటలో నితిన్-వక్కంతం వంశీ సినిమా.. ఇదేం సాహసమబ్బా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 
 
 
 
 

Trending News