7th Pay Commission: డీఏ పెంపు, డీఏ ఏరియర్స్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా అప్‌డేట్...

7th Pay Commission DA Hike and DA Arrears Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ ఎప్పుడు... డీఏ ఏరియర్స్ ఎప్పుడు అందుతుంది... దీనిపై లేటెస్ట్ అప్‌డేట్స్..

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 25, 2022, 04:17 PM IST
  • డీఏ పెంపు ఎప్పుడు.. ఎంత పెరిగే ఛాన్స్
  • కేంద్రం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది
  • లేటెస్ట్ అప్‌డేట్స్‌తో కూడిన సమాచారం
7th Pay Commission: డీఏ పెంపు, డీఏ ఏరియర్స్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా అప్‌డేట్...

7th Pay Commission DA Hike and DA Arrears Update: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి డీఏ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి పెరిగిన డీఏని అమలుచేస్తోంది. ఇక రెండో డీఏ పెంపుపై మాత్రం కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో రెండో డీఏ పెంపు కోసం ఉద్యోగులు ప్రతీ నెలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో డీఏ పెంపుకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ తెర పైకి వచ్చింది. ఆ అప్‌డేట్ ప్రకారం.. డీఏ ఎంత మేర పెరగనుంది.. ఎప్పుడు పెరగనుందనేది ఇప్పుడు తెలుసుకుందాం...

డీఏ పెంపు ఎంత ఉండొచ్చు :

ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) జూన్ నెలలో 129.2 పాయింట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏఐసీపీఐ రిపోర్ట్స్‌ను గమనిస్తే.. ప్రతీ నెలా ఇండెక్స్ పెరుగుతూనే ఉంది. ఇదే ట్రెండ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఉద్యోగులకు ఎంత లేదన్నా 4 శాతం డీఏ పెంపుకి 7వ వేతన సంఘం కేంద్రానికి సిఫారసు చేయవచ్చు. కేంద్రం ఆ మేరకు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరుతుంది.

ఇంతకీ డీఏ పెంపుపై ప్రకటన ఎప్పుడు :

కేంద్ర కేబినెట్ త్వరలోనే సమావేశమై డీఏ పెంపుపై  నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా సెప్టెంబర్ చివరి వారానికల్లా దీనిపై కేంద్రం ప్రకటన చేయవచ్చు. పెరిగిన డీఏని సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 

డీఏ ఏరియర్స్ సంగతేంటి :

కోవిడ్ కాలంలో 18 నెలల డీఏ చెల్లింపులు కేంద్రం బకాయిపడింది. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు చెల్లింపులు నిలిపివేసింది. డీఏ ఏరియర్స్ ఎప్పుడిస్తారనే దానిపై ఇప్పటికైతే ఎటువంటి ప్రకటన రాలేదు. డీఏ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. జేసీఎం సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా సుప్రీం తీర్పును ప్రస్తావిస్తూ ఇదే విషయాన్ని పేర్కొన్నారు. బకాయిపడ్డ డీఏకి కేంద్రం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఉద్యోగులు కేంద్రంతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ చర్చలు ముందుకెళ్లవచ్చు. 

Also Read: Heros Rejected Liger: ప్రభాస్, ఎన్టీఆర్ సహా లైగర్ ను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరంటే?

Also Read: Raja Singh: రాజాసింగ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా..? తాజాగా పోలీసుల నుంచి నోటీసులు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News