షాకింగ్ న్యూస్: పిడుగు లాంటి వార్త బయటపెట్టిన బిగ్ బి !!

స్వస్థ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ అమితాబ్ తన ఆరోగ్య సమస్యలను బయటపెట్టారు

Last Updated : Aug 20, 2019, 11:24 PM IST
షాకింగ్ న్యూస్: పిడుగు లాంటి వార్త బయటపెట్టిన బిగ్ బి !!

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (76) అందర్నీ షాక్‌కు గురి చేసే వార్త బయటపెట్టారు. తాను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నానని బిగ్ బి బాంబు పేల్చారు. స్వస్థ్‌ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన అమితాబ్ తన ఆరోగ్య సమస్యల గురించి  చెప్పి అందరినీ దిగ్భాంత్రికి గురి చేశారు. ఈ సందర్భంగా బిగ్ బి మాట్లాడుతూ ఇదంతా తాను పబ్లిసిటీ కోసం చెప్పుకోవడం లేదని.. నాలాగా మరొకరు బాధపడకూడదని చెబుతున్నానని బిగ్ బి అవేదన వ్యక్తం చేశారు

బిగ్ బి ఇంకా ఏమన్నారంటే..

బిగ్ బి అమితాబ్ మాట్లాడుతూ ఒకప్పుడు తనకు క్షయ, హైపటైటిస్‌ బి వ్యాధులు ఉండేదని...దాదాపు ఎనిమిదేళ్లు వీటిని తాను గుర్తించలేకపోయాన్నారు. చెడు రక్తం వల్ల అప్పటికే తన కాలేయం 75 శాతం చెడిపోయిందని తెలిపారు. ప్రాధమిక దశలో గుర్తించకపోవడం వల్లే తన కాలేయం చెడిపోయిందన్నారు. ప్రారంభంలోనే దీన్ని గుర్తించినట్లయితే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని..ముఖ్యమంగా కాస్త వయసు మళ్లీనోళ్లో తరచూ తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని అమితాబ్ సూచించారు

Trending News